క్రీస్తు శకము నందు ప్రస్తుత మ్మింకొక్క
క్రొత్త వత్సరమ్ము కొలువు దీరె ,
మనిషి బ్రతుకు నందు మార్పులేవైపుకో ?
మంచివైపు కగున
ఇంచుకైన ?
భూమికావల నెక్కడో పుడమి బోలు
పుడమి కోసము గాలించు బుధులు ! ‘ సగము
కూటి కేడ్చెద రిచట ‘ ఆకొన్న జనుల
గూర్చి బాగోగు లరయరా ? కొంచమేని .
గతము కంటె చదువులు , విజ్ఞాన మధిక
మయ్యె గాని
, సంస్కార మేమయ్యెనో క
నంబడదు, వక్ర బుధ్ధి కనంగ నయ్యె ,
మానవత్వమె
అన్నింట మాన్యత గద !
తెలుగు రాష్ట్రాలు రెండయ్యె , చెలగి యందు
ఒకటి స్వర్ణాంధ్ర యయ్యె , ఇంకొకటి యిదిగొ !
కనుడు! బంగారు మయమయ్యె , కరువు బట్టి
రైతు చచ్చెను మృత్యు కోరలకు జిక్కి .
ధరవరలు పెరిగి బతుకు దారుణమయి
సగటు జీవులు కడగండ్ల బొగులుచుండ ,
పట్ట వేలిన వారికి ప్రజల పాట్లు
ఏటి కేడాది మారిన నేమి యొరుగు ?