తెలుగు నాట బలుకు తియ్యని మాటతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెలుగు జాతీయాల తియ్యం దనాలతో
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు గ్రామీణుల తీరు తెన్నుల తోడ
తెలుగు పద్యము కొల్వు దీర వలయు
తెల్గు లోగిళ్ల వర్ధిల్లు వెల్గుల తోడ
తెల్గు పద్యము కొల్వు దీర వలయు
కూడి పండితుల్ దలలూచు కొరకె గాక
తెల్గు లందరి కందంగ దివురు నటుల
తెల్గు ముంగిళ్ల గెడన సందీప్తు లిడగ
తెలుగు పద్యము తా గొల్వు దీర వలయు
16, డిసెంబర్ 2017, శనివారం
15, డిసెంబర్ 2017, శుక్రవారం
తెలుగు పద్య సఖియ .....
నెల్లూరు సన్నబియ్యము
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్
*****
తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలియ కంటె ,
మల్లె విరుల కంటె , మనసైన పని కంటె
భాగ్య నగరి లోని బ్రతుకు కంటె
*****
పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కవితలో
*****
తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల
*****
తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్
*****
తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలియ కంటె ,
మల్లె విరుల కంటె , మనసైన పని కంటె
భాగ్య నగరి లోని బ్రతుకు కంటె
*****
పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కవితలో
*****
తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల
*****
తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !
23, నవంబర్ 2017, గురువారం
బిడ్డల్ని కనడానికి మంచి రోజులు .....
Courtesy
ఆంధ్రజ్యోతి
ఇరు వర్గాలు – రెండుపంచాంగాలు ------------------------------------------ తిథి , నక్షత్రాల ప్రవేశ విషయంలోవాదోప వాదాలు - సామరస్యం కొరవడిన అతిశయాలు -
సందర్భమా - ఆందోళన కరం
అసలు విషయంలోకి వద్దాం . ఆ రోజు వైద్యం కోసం మా ఆవిడని హాస్పిటల్
కు తీసుకెళ్ళడం జరిగింది . అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ .
రిసెప్షన్ హాల్లో నలుగురైదుగురు ఆడవాళ్ళూ , నలుగురైదుగురు మగవాళ్ళూ
పంచాంగాలు తెచ్చుకొని మరీ సప్రమాణంగా వాదించు కుంటున్నారు .
అమ్మాయికి నెలలు నిండినట్లుంది . సిజేరియన్ అవసరమైన పరిస్థితిలా
కనబడుతోంది . తొలి కాన్పేమో . అమ్మాయిలో ఆందోళన కనబడుతూఉంది.
హైపర్టెన్షన్కు గురై ఉండవచ్చు . అందువల్ల నార్మల్ డెలివరీ వరకూ వెయిట్
చెయ్యడం కుదరక పోవచ్చు . డాక్టర్ సిజేరియన్కు సిధ్ధం చేస్తున్నట్టున్నారు .
థియేటరు వద్ద ఆ హడావిడి కన్పిస్తూ ఉంది . ఇదీ సీను .
అయినా అమ్మాయి ఉన్న ఈ పరిస్థితిలో అసలు వీళ్ళకు తిథులూ నక్షత్రా
ల కోసం వాదులాడు కోవడానికి నిలకడెలా వచ్చిందో నాకైతే అంతు పట్టలేదు .
ఈ కథనంలో కాస్తంత కూడా అవాస్తవంలేదు . తిథి ప్రవేశించిందాకా ఆగాల్సిందే నని పట్టుబట్టి కాస్తంత ఆలస్యం జరిగి , ఆ తల్లీ బిడ్డలకేదైనా
ప్రమాదం జరిగితేనో –
ఇరువైపుల వాళ్ళల్లో- ఆడవాళ్ళైతే కట్టూ బొట్టూతో ఆర్భాటంగానూ , మగ
వాళ్ళైతే సూటూ బూటూతో అతిశయంగానూ, బాగా చదువుకున్నవాళ్ళ
లాగా కన్పిస్తున్నారు .
ఆధ్యాత్మికత , దైవం మీద నమ్మకం – ఈ రెండు భావనలూ – వీటిలోని
సత్యాసత్యాలు పక్కన పెడితే – మనిషికి పరిణతినిచ్చి , కట్టడి చేసి ,
సమాజం కొంతవరకు సజావుగా నడవడానికి దోహద పడ్డవి .
అడుగడుగునా భ్రమలతో , భయాలతో భద్రతలేని జీవన యానంలో
సతమత మయ్యే మనిషి – తనకంటే శక్తి మంతమైన ఉనికిని గుర్తించి,
ఆ శక్తిని దైవంగా భావించి , ఆపదలో తనకు ఆసరా కోసం నమ్మి ,
ఆరాధించడం మొదలై ఉండవచ్చు .
కానీ , జరుగబోయే పరిణామాలను ముందే గ్రహించగలగడం – తదను గుణంగా భవష్యత్తును తన అజమాయిషీలోకి తెచ్చుకో జూడడం దురాశే కాదు , అసాధ్యం కూడాను .
మరణించేదాకా హాయిగా బతకాలని కోరుకుంటాము . సాధ్యమయ్యే నా?
భవిష్యజ్జీవితంలో జరిగే పరిణామాలేమిటో తెలుసుకో గల్గితే ?
ఎవరైనా చెప్పగల్గితే ? ఈ ఊహే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది .
ఈ బలహీనత లో నుంచే , ఈ దురాశలోనుంచే ఏర్పడిన ’ ఒక సంప్రదాయం’ భారతీయ జీవన విధానంలో భాగమై , శాస్త్ర మనే భ్రమ కల్పించింది .
నేటికీ వెర్రితలలు వేస్తున్న ఈ జాతక చక్రాల మాయ వీడే దెన్నడో ?
మన సమాజాన్ని బ్రమలలో ముంచే ఇలాంటి దుర్మార్గాలు నశించే దెన్నడో ?
12, నవంబర్ 2017, ఆదివారం
పద్యం - పరమార్థం
పద్యం - పరమార్థం
*****************
వచనం గుర్తుంచుకోవడానికి వీలవదు . మనస్సు
నాకట్టు కుంటే పద్యం హత్తుకు పోతుంది .పలు
సందర్భాలలో ఉదహరించ బడుతుంది .
వచనంలో లేని ' నడక - లయ ' పద్యాన్ని గుర్తుం
డేలా చేస్తుంది . వచనంలో లేని ' స్వారస్యం ' పద్యంలో చూపించ వచ్చు . శబ్ద అనువృత్తులు
శోభను కూర్చి పద్యాన్ని మనోఙ్ఞం చేస్తాయి .
తెలుగు వాళ్ళు ఇప్పటికీ సుమతి , వేమన శతకాలనూ , భాగవత పద్యాలనూ నెమరు వేసుకుంటుంటారంటే పద్యం సరళంగానూ ,
చదువగానే అర్థమయ్యేలా ఉండబట్టే జనం
లోకి అమితంగా చొచ్చుకు పోయినవి .
' మేం పండితులం , మామూలు జనం కంటే
మాకు రెండేసి తలలున్నాయి ' అనుకోబట్టే
పద్యానికి జనం దూరమయ్యారు .
పద్యాన్ని సరళం చేసి , చదవంగానే అర్థమయ్యే
భాషలో రాస్తే , జనానికి చేరువౌతుంది . ఔత్సాహి
కులు రాయడానికి కూడా ముందుకు వస్తారు .
తెలుగు పద్యం కలకాలం వర్థిల్లుతుంది .
పద్యం రాయడానికి ఎవడైనా ముందుకొస్తే
ఈపదం గ్రామ్యం , ఈపదం వ్యాకరణ విరుధ్ధం ,
అని బెదరగొట్టేస్తున్నారు . అమ్మో , ఇది మనకు అచ్చుబాటయ్యే విషయం కాదు ,ఇదిపండితులకు
సంబంధించింది . - అని ఔత్సాహికులు మథ్యలోనే వదిలేస్తున్నారు .
సోషల్ మీడియా వల్ల జనంలో చాలమంది రచనల పట్ల , ముఖ్యంగా పద్యం పట్ల ఆకర్షితులౌతున్నారు . వారికి సహకరించాలి గాని , తమ శషభిషలతో అవమాన పరచడం పండితులకు భావ్యం కాదు .
వాడుకభాష పారుటేరు . మార్పు జీవద్భాషకు సహజం . మారిన మార్పును నమోదు చేసేందుకే వ్యాకరణం . పిడికెడు మంది పండితులు తలలూచడమే భాషకు ప్రయోజనం కారాదు . జన బాహుళ్యం లోకి చొచ్చుకు పోతేనే ఏదైనా బ్రతికుండేది .
పూర్వకవుల వాడుక భాష కూడా గ్రాంథికమే . మనం గ్రాంధికం మాట్లాడడం లేదే .
శిష్ట వ్యావహారికం కూడా పద్యంలో పనికి రాదా ?
అసలు తమరు రాసే పద్యాలు చదువరులకు
అర్థం కాక పోతే రాసేదెందుకు . మరీ విచిత్రంగా
కొందరు తాము రాసిన పద్యంలోని పదాలకు టీకా , టిప్పణి రాసుకుంటున్నారు .
చేయుచూ , చేస్తూ అని రాయకూడదట . అది వ్యావహారికం , చేయుచున్ అని గ్రాంధికం రాయండని ఆదేశిస్తున్నారు .
కాస్తయినా అనకూడదట , కొంతయినా అనాలట .
వల్ల అనకూడదు వలన అనాలి . ఇలా శిష్ట వ్యవహారాలుకూడా
పద్యంలో కూడదట . అడిగితే , మావి
సాంప్రదాయిక తులసివనాలంటారు .
నా భాదల్లా, సోషల్ మీడియాల పుణ్యం
వల్ల పద్యం రాయడం నేర్చుకోవడానికి చాలమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు . వారికి
సహకరించండి . పద్యాన్ని కనీసం కొన్ని తరాల
వరకైనా మననీయండి .
ఇక , నావిషయం -
తమరనుకుంటూండవచ్చు . ' వీడికేం తెలుసు ఛందస్సు , వ్యాకరణం - వాటి గొప్పతనం , వీడు
కూడా భాషను గూర్చి మాటాడే వాడా ' - అని .
నేను విద్వాన్ , పండిత శిక్షణ , MA , B ed , ఇంకా
అనేకం చదువుకున్న వాణ్ణి . ఛందో వ్యాకరణ భాషాశాస్త్రాలు పఠించిన భాషా , సారస్వతాభి
మానిని . 38 దేండ్లు ఉపాధ్యాయ వృత్తి నెరపిన
వాణ్ణి . కానీ , పండితాహంకారం కానీ భేషజం కానీ
దరిజేరనీయను . వినయం అలంకారం గా బ్రతికిన
వాణ్ణి .
భాష పుట్టింది జనబాహుళ్యం నాలుకల మీద .
పండితుల మెదళ్ళ నుండి కాదు .
పద్యాన్ని పలువురు చదివేలా , రాయడం నేర్చు
కునేలా ప్రయత్నిద్దాం .
*****************
వచనం గుర్తుంచుకోవడానికి వీలవదు . మనస్సు
నాకట్టు కుంటే పద్యం హత్తుకు పోతుంది .పలు
సందర్భాలలో ఉదహరించ బడుతుంది .
వచనంలో లేని ' నడక - లయ ' పద్యాన్ని గుర్తుం
డేలా చేస్తుంది . వచనంలో లేని ' స్వారస్యం ' పద్యంలో చూపించ వచ్చు . శబ్ద అనువృత్తులు
శోభను కూర్చి పద్యాన్ని మనోఙ్ఞం చేస్తాయి .
తెలుగు వాళ్ళు ఇప్పటికీ సుమతి , వేమన శతకాలనూ , భాగవత పద్యాలనూ నెమరు వేసుకుంటుంటారంటే పద్యం సరళంగానూ ,
చదువగానే అర్థమయ్యేలా ఉండబట్టే జనం
లోకి అమితంగా చొచ్చుకు పోయినవి .
' మేం పండితులం , మామూలు జనం కంటే
మాకు రెండేసి తలలున్నాయి ' అనుకోబట్టే
పద్యానికి జనం దూరమయ్యారు .
పద్యాన్ని సరళం చేసి , చదవంగానే అర్థమయ్యే
భాషలో రాస్తే , జనానికి చేరువౌతుంది . ఔత్సాహి
కులు రాయడానికి కూడా ముందుకు వస్తారు .
తెలుగు పద్యం కలకాలం వర్థిల్లుతుంది .
పద్యం రాయడానికి ఎవడైనా ముందుకొస్తే
ఈపదం గ్రామ్యం , ఈపదం వ్యాకరణ విరుధ్ధం ,
అని బెదరగొట్టేస్తున్నారు . అమ్మో , ఇది మనకు అచ్చుబాటయ్యే విషయం కాదు ,ఇదిపండితులకు
సంబంధించింది . - అని ఔత్సాహికులు మథ్యలోనే వదిలేస్తున్నారు .
సోషల్ మీడియా వల్ల జనంలో చాలమంది రచనల పట్ల , ముఖ్యంగా పద్యం పట్ల ఆకర్షితులౌతున్నారు . వారికి సహకరించాలి గాని , తమ శషభిషలతో అవమాన పరచడం పండితులకు భావ్యం కాదు .
వాడుకభాష పారుటేరు . మార్పు జీవద్భాషకు సహజం . మారిన మార్పును నమోదు చేసేందుకే వ్యాకరణం . పిడికెడు మంది పండితులు తలలూచడమే భాషకు ప్రయోజనం కారాదు . జన బాహుళ్యం లోకి చొచ్చుకు పోతేనే ఏదైనా బ్రతికుండేది .
పూర్వకవుల వాడుక భాష కూడా గ్రాంథికమే . మనం గ్రాంధికం మాట్లాడడం లేదే .
శిష్ట వ్యావహారికం కూడా పద్యంలో పనికి రాదా ?
అసలు తమరు రాసే పద్యాలు చదువరులకు
అర్థం కాక పోతే రాసేదెందుకు . మరీ విచిత్రంగా
కొందరు తాము రాసిన పద్యంలోని పదాలకు టీకా , టిప్పణి రాసుకుంటున్నారు .
చేయుచూ , చేస్తూ అని రాయకూడదట . అది వ్యావహారికం , చేయుచున్ అని గ్రాంధికం రాయండని ఆదేశిస్తున్నారు .
కాస్తయినా అనకూడదట , కొంతయినా అనాలట .
వల్ల అనకూడదు వలన అనాలి . ఇలా శిష్ట వ్యవహారాలుకూడా
పద్యంలో కూడదట . అడిగితే , మావి
సాంప్రదాయిక తులసివనాలంటారు .
నా భాదల్లా, సోషల్ మీడియాల పుణ్యం
వల్ల పద్యం రాయడం నేర్చుకోవడానికి చాలమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు . వారికి
సహకరించండి . పద్యాన్ని కనీసం కొన్ని తరాల
వరకైనా మననీయండి .
ఇక , నావిషయం -
తమరనుకుంటూండవచ్చు . ' వీడికేం తెలుసు ఛందస్సు , వ్యాకరణం - వాటి గొప్పతనం , వీడు
కూడా భాషను గూర్చి మాటాడే వాడా ' - అని .
నేను విద్వాన్ , పండిత శిక్షణ , MA , B ed , ఇంకా
అనేకం చదువుకున్న వాణ్ణి . ఛందో వ్యాకరణ భాషాశాస్త్రాలు పఠించిన భాషా , సారస్వతాభి
మానిని . 38 దేండ్లు ఉపాధ్యాయ వృత్తి నెరపిన
వాణ్ణి . కానీ , పండితాహంకారం కానీ భేషజం కానీ
దరిజేరనీయను . వినయం అలంకారం గా బ్రతికిన
వాణ్ణి .
భాష పుట్టింది జనబాహుళ్యం నాలుకల మీద .
పండితుల మెదళ్ళ నుండి కాదు .
పద్యాన్ని పలువురు చదివేలా , రాయడం నేర్చు
కునేలా ప్రయత్నిద్దాం .
11, నవంబర్ 2017, శనివారం
మన తెలుగు వర్థిల్లాలి .
పద్యమైన , వచనమైన పాఠకులకు
అర్థ మవని యెడల పరమార్థమేమి ?
పండితుల కిది ఫేషనా ? బాగు , బాగు !!
వారి దారులు వారివి వదులుకోరు .
పదిమందికి తెలిసిన తగు
పదజాలము పద్యమందు వాడి , సరసమౌ
విధమున పద్యము వ్రాయుట
కుదరని వారెందుకయ్య గొప్పలువోవన్ ?
పద్యములు వ్రాసి , అందులో పదము , లాంధ్ర
భారతిలో జూపి , సూచన వ్రాయు ఖర్మ
తెలుగు భాషకు పట్టెను , ధీ మతు లట !!
డిక్ష్ణరీల భాష లిట పాటింతు రకట !
వాడుకన లేని , తెలియని పదము వాడి
గొప్పఘా ఫీలగుట మన కోవిదులకు
గొప్ప గాబోలు ! నిదియేమి గొప్ప బాబు !
మూగ-చెవిటి వారి విధము ముచ్చట గద !
ప్రజల నోళ్ళయందు పరిఢ విల్లిన భాష
శాశ్వితముగ బ్రతుకు విశ్వమందు ,
పేరు గొప్ప కొఱకు పిడికెడు పండితుల్
వాడు భాష మనదు , వాస్తవ మిది .
అర్థ మవని యెడల పరమార్థమేమి ?
పండితుల కిది ఫేషనా ? బాగు , బాగు !!
వారి దారులు వారివి వదులుకోరు .
పదిమందికి తెలిసిన తగు
పదజాలము పద్యమందు వాడి , సరసమౌ
విధమున పద్యము వ్రాయుట
కుదరని వారెందుకయ్య గొప్పలువోవన్ ?
పద్యములు వ్రాసి , అందులో పదము , లాంధ్ర
భారతిలో జూపి , సూచన వ్రాయు ఖర్మ
తెలుగు భాషకు పట్టెను , ధీ మతు లట !!
డిక్ష్ణరీల భాష లిట పాటింతు రకట !
వాడుకన లేని , తెలియని పదము వాడి
గొప్పఘా ఫీలగుట మన కోవిదులకు
గొప్ప గాబోలు ! నిదియేమి గొప్ప బాబు !
మూగ-చెవిటి వారి విధము ముచ్చట గద !
ప్రజల నోళ్ళయందు పరిఢ విల్లిన భాష
శాశ్వితముగ బ్రతుకు విశ్వమందు ,
పేరు గొప్ప కొఱకు పిడికెడు పండితుల్
వాడు భాష మనదు , వాస్తవ మిది .
10, నవంబర్ 2017, శుక్రవారం
పొద్దు వాటాలె .....
ఏ వ్రేలు పట్టి తా నిలను నడిపించెనో
ఆ వ్రేలు తన కూత మగునొ లేదొ
ఏ బాల్యమునకు తా నింత ఙ్ఞాన మిడెనొ
ఆబాల్య మండయై ఆదు కొనున
ఏ తీగె సాగుట కెండు కట్టెయి నిల్చి
పెంచిన పొదరిల్లు ప్రియ మొసగున
కౌలు రైతిట వచ్చి నిలువు కట్టెకు నీడ
నొనర నిచ్చున పెద్ద మనసు గదుర
షష్టి సప్తతియు నశీతి చని సహస్ర
పున్నములు జూచె నీ వృధ్ధ మూర్తి , యితని
సాదుకుందురొ లేదొ , ఈ స్వాదు ఫలము
రాలు నందాక బిడ్డలు మేలు దలచి .
ఆ వ్రేలు తన కూత మగునొ లేదొ
ఏ బాల్యమునకు తా నింత ఙ్ఞాన మిడెనొ
ఆబాల్య మండయై ఆదు కొనున
ఏ తీగె సాగుట కెండు కట్టెయి నిల్చి
పెంచిన పొదరిల్లు ప్రియ మొసగున
కౌలు రైతిట వచ్చి నిలువు కట్టెకు నీడ
నొనర నిచ్చున పెద్ద మనసు గదుర
షష్టి సప్తతియు నశీతి చని సహస్ర
పున్నములు జూచె నీ వృధ్ధ మూర్తి , యితని
సాదుకుందురొ లేదొ , ఈ స్వాదు ఫలము
రాలు నందాక బిడ్డలు మేలు దలచి .
9, నవంబర్ 2017, గురువారం
కందాక్రందనము .....
జొట జొట కన్నీ రొలుకగ
కట కటబడి కందబాల కళదప్పి కడున్
అట మటముల నిటుల వలికె
కట కట డగ్గుత్తిక వడ కలలో నాతో .
అన్నా ! నీ వెరుగవె ! నే
నన్నిట సుకుమారినిగద ! నన్నొక బామ్మా
తన్నిన తన్నులు తన్నక
తన్నుచు నున్నది పదాల తాడనములతో .
మీ నెల్లూరున తిక్కన ,
మానుగ వేమన్న - కడప మారాజు ననున్
మేనెల్ల హేమ పరిమళ
మానితముగ దీర్చినారు , మన్నన గలిగెన్ .
ఛిన్నా భిన్నం బైతిని
నిన్నటి విభవంబు వోయె , నే డిట్టుల సం
ఖిన్న వదన రదన మహా
పన్న విరూప విపరీత ప్రకృతిన్ బడితిన్ .
నరసన్న , భాస్కరన్నలు ,
మరియును మన బండిరావు మాన్యులు , మీరున్
కరుణింతు రనుచు బొగిలితి ,
పర పీడన నుండి నన్ను బైట బడేయన్ .
.....jk......
కట కటబడి కందబాల కళదప్పి కడున్
అట మటముల నిటుల వలికె
కట కట డగ్గుత్తిక వడ కలలో నాతో .
అన్నా ! నీ వెరుగవె ! నే
నన్నిట సుకుమారినిగద ! నన్నొక బామ్మా
తన్నిన తన్నులు తన్నక
తన్నుచు నున్నది పదాల తాడనములతో .
మీ నెల్లూరున తిక్కన ,
మానుగ వేమన్న - కడప మారాజు ననున్
మేనెల్ల హేమ పరిమళ
మానితముగ దీర్చినారు , మన్నన గలిగెన్ .
ఛిన్నా భిన్నం బైతిని
నిన్నటి విభవంబు వోయె , నే డిట్టుల సం
ఖిన్న వదన రదన మహా
పన్న విరూప విపరీత ప్రకృతిన్ బడితిన్ .
నరసన్న , భాస్కరన్నలు ,
మరియును మన బండిరావు మాన్యులు , మీరున్
కరుణింతు రనుచు బొగిలితి ,
పర పీడన నుండి నన్ను బైట బడేయన్ .
.....jk......
19, అక్టోబర్ 2017, గురువారం
హోదా టపాసు - టపాసు ప్యాకేజి
చిచ్చుబుడ్లకు బదుల్ చచ్చు బుడ్లిచ్చిరి
కాకర పూగుత్తి కాలదయ్యె
విరి మతాబుల బదుల్ సురసురాలిచ్చిరి
డాంటపాసుల వొత్తు లంట వయ్యె
భూచక్రములు కాస్త బూజు పట్ఠె తడిసి
విష్ణు చక్రమ్ములు వెలుగ వయ్యె
తారజువ్వ లరచి తడబడి తడబడి
నింగి కెగుర లేక నీల్గుచుండె
ఆంధ్ర కిచ్చిరి ' టపాసులు ' కేంద్ర మిదిగొ !
రాదు ప్రత్యేక హోదా , పరాయి మనము ,
చాలు ' ప్యాకేజి ' మన్ను , యెంచక్క మనకు
సర్దుకొనిపోవు నలవాటు చాల గలదు .
అమర పురాధిపు లందరు
సమరము శాయంగలేక శాంతియు , క్షమయున్
సమపాళ్ళ గలిపి త్రాగుచు
బ్రమ లందున ముంచి ప్రజల , బ్రతుకుదు రెలమిన్ .
కాకర పూగుత్తి కాలదయ్యె
విరి మతాబుల బదుల్ సురసురాలిచ్చిరి
డాంటపాసుల వొత్తు లంట వయ్యె
భూచక్రములు కాస్త బూజు పట్ఠె తడిసి
విష్ణు చక్రమ్ములు వెలుగ వయ్యె
తారజువ్వ లరచి తడబడి తడబడి
నింగి కెగుర లేక నీల్గుచుండె
ఆంధ్ర కిచ్చిరి ' టపాసులు ' కేంద్ర మిదిగొ !
రాదు ప్రత్యేక హోదా , పరాయి మనము ,
చాలు ' ప్యాకేజి ' మన్ను , యెంచక్క మనకు
సర్దుకొనిపోవు నలవాటు చాల గలదు .
అమర పురాధిపు లందరు
సమరము శాయంగలేక శాంతియు , క్షమయున్
సమపాళ్ళ గలిపి త్రాగుచు
బ్రమ లందున ముంచి ప్రజల , బ్రతుకుదు రెలమిన్ .
18, అక్టోబర్ 2017, బుధవారం
చిత్రవధ జేసె ' కొడుకును , చెడును ' - సత్య .....
గరుడుపై నిడుచక్కి గగనాని కెగబ్రాకి
కోపానల జ్వాల కోల జేసి
వింటి నారికి జేర్చి మంటికి మింటికి
కణ కణ విస్ఫులింగాలు రాల
నాధుండు డస్సి విణ్ణాణంబు వీక్షించ
గరుడుండు గువ్వయి కానుపింప
జడిసి సురాసుర లుడిగి భువి బడంగ
బ్రహ్మ మేల్కాంచి విభ్రమము దొడర
కదన రంగాన గల నరకాసురుండు
నీ కొడుకునమ్మ ! చంపొద్దని యడు గిడుచు
ఏడ్చి గీపెట్టి చేతులు మ్రోడ్చు చున్న
చిత్రవధ జేసె ' కొడుకును , చెడును ' - సత్య .
చెడును శిక్షించు పట్టున పుడమి తల్లి
యే వివక్షను చూపలేదే ! విడువక ,
రావణుని చావు పట్టున రమణి సీత
తల్లి పుడమిని తలపించె తాను కూడ .
9, అక్టోబర్ 2017, సోమవారం
మా కుల్లూరు - చదువుల సిరి
చదువులమ్మ మమ్ము చల్లగా దీవించె
సిరుల కొమ్మ మాకు చేరువయ్యె
సిరియు చదువులమ్మ జీవించి రీ యూరి
బలిజ లిండ్ల వెలసి కొలువుదీరి .
కోట బలిజ లైరి కొలువులు వెలయించి
రాజసమ్ము నాడు రాజ్యమేలె
పేట బలిజ లైరి పేరైన వాణిజ్య
సరణి పూని మథ్య తరములందు .
ఒజ్జబంతులైరి ఊరు ఊరంతయు
గురువు లనగ నాడు గౌరవమ్ము
ఇంజనీర్లు , వెజ్జు లిప్పటి తరమందు
పెద్ద చదువు లందు పేర్మి కలిమి .
తల్లి దయలు గలుగ కుల్లూరు బలిజలు
భాగ్యవంతు లెల్ల యోగ్యతలకు
చదువులందు సకల సంపద లందున
సాటి రారు మాకు సకల జనులు .
ఏ పట్టణ మే నగరము
యేపట్టున జూడ మేమె యేర్పడ ఘనమై
చూపట్టుదు మంతట మా
దీపపు వెలు గంతవట్టు దీపింపంగా .
సిరుల కొమ్మ మాకు చేరువయ్యె
సిరియు చదువులమ్మ జీవించి రీ యూరి
బలిజ లిండ్ల వెలసి కొలువుదీరి .
కోట బలిజ లైరి కొలువులు వెలయించి
రాజసమ్ము నాడు రాజ్యమేలె
పేట బలిజ లైరి పేరైన వాణిజ్య
సరణి పూని మథ్య తరములందు .
ఒజ్జబంతులైరి ఊరు ఊరంతయు
గురువు లనగ నాడు గౌరవమ్ము
ఇంజనీర్లు , వెజ్జు లిప్పటి తరమందు
పెద్ద చదువు లందు పేర్మి కలిమి .
తల్లి దయలు గలుగ కుల్లూరు బలిజలు
భాగ్యవంతు లెల్ల యోగ్యతలకు
చదువులందు సకల సంపద లందున
సాటి రారు మాకు సకల జనులు .
ఏ పట్టణ మే నగరము
యేపట్టున జూడ మేమె యేర్పడ ఘనమై
చూపట్టుదు మంతట మా
దీపపు వెలు గంతవట్టు దీపింపంగా .
8, అక్టోబర్ 2017, ఆదివారం
మా కుల్లూరు - కవి పండితులు
ఎన్నో తరముల నుండియు
పన్నుగ మా పెద్దలంత పండిత కవులే ,
మున్నిట కావ్యములు వెలసి
యున్నవి కొన్నింటి దెల్పు దుదహృత మొనరన్
తోట నరసింహ దాసు చేతో ముదముగ
' రామ రామ ' శతకము నేర్పడగ జెప్పె
పిండ మాది జన్మాంతమై వెలయు కథన
మద్భుతమ్ముగ వెలయించె నందు బుధుడు
దరిమడుగు వంశ ధీనిధు
లిరువురు కవి సోదరులు రచించిరి కావ్యాల్
అరయన్ మల్లయ , కామయ
లరుదగు పండితులు బలిజ లందు ప్రముఖులున్
ప్రౌఢ కావ్యమ్ము ' భారవి ' , ' రాయ ' లనెడు
నాటకమ్మును కామయ్య , ఆటవెలది
జెలగు ' రామాయణమ్ము 'ను వెలయ జేసె
మల్లయ మనోహరముగ రామార్పణముగ
త్రవ్వి తీయంగ నింకనూ నివ్వటిల్లు
నిచటి బలిజ బుధ వరుల రచన లెన్నొ
అందు బుట్టిన నేనునూ అంది పుచ్చు
కొంటి కొంతగా నైన నా కోర్కె దీర .
పన్నుగ మా పెద్దలంత పండిత కవులే ,
మున్నిట కావ్యములు వెలసి
యున్నవి కొన్నింటి దెల్పు దుదహృత మొనరన్
తోట నరసింహ దాసు చేతో ముదముగ
' రామ రామ ' శతకము నేర్పడగ జెప్పె
పిండ మాది జన్మాంతమై వెలయు కథన
మద్భుతమ్ముగ వెలయించె నందు బుధుడు
దరిమడుగు వంశ ధీనిధు
లిరువురు కవి సోదరులు రచించిరి కావ్యాల్
అరయన్ మల్లయ , కామయ
లరుదగు పండితులు బలిజ లందు ప్రముఖులున్
ప్రౌఢ కావ్యమ్ము ' భారవి ' , ' రాయ ' లనెడు
నాటకమ్మును కామయ్య , ఆటవెలది
జెలగు ' రామాయణమ్ము 'ను వెలయ జేసె
మల్లయ మనోహరముగ రామార్పణముగ
త్రవ్వి తీయంగ నింకనూ నివ్వటిల్లు
నిచటి బలిజ బుధ వరుల రచన లెన్నొ
అందు బుట్టిన నేనునూ అంది పుచ్చు
కొంటి కొంతగా నైన నా కోర్కె దీర .
5, అక్టోబర్ 2017, గురువారం
అందరూ చదవ తగ్గ ' ఉత్తరం ' .
రచయితెవరో తెలియదు .
ఒక మిత్రుడు fb లో ప్రచు
రించారు . రచయితకూ
సేకరించిన సదరు మి
త్రునికీ ధన్యవాదములు .
అందరూ చదువ దగ్గది .
*****************
చిరంజీవి ------- కి,
అమ్మ దీవించి వ్రాయునది.
నేను క్షేమంగానే ఇల్లు చేరాను. కోడలు ,పిల్లలు కులాసా అని తలుస్తాను.
నా అంతవాడివి నువ్వైయ్యావు,
నీ కుటుంబం నీది.
మీ ఇంట్లో మీరు మీకు నచ్చినట్లు నడచుకొంటారు. కానీ,తల్లిగా నీకు ఇష్టంవున్నా లేకపోయినా కొన్ని విషయాలు చెపుదామనుకొంటున్నాను.
నచ్చితే విను.
నచ్చకపోతే వదిలెయ్ .
పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. వాళ్ళని మీరు ఎలా తయారుచేస్తేవాళ్ళు అలా తయారౌతారు.
ముఖ్యంగా మీ భార్యా భర్తలిద్దరూ ఒక విషయం గ్రహించాలి.
పిల్లలెదురుగుండా మీరు ఆర్థిక విషయాలు మాట్లాడుకొని, అసహనంగా మాటలు విసురుకోరాదు. వారి ఎదురుగా, నువ్వెక్కువంటే నువ్వు తక్కువ అనుకోకూడదు.
చుట్టాల గురించీ, బంధువుల గురించీ చులకన చేసి మాట్లాడకూడదు.
అలాగే,వాళ్ళు చదువుతున్న స్కూలు గురించీ, టీచర్ల గురించీ తక్కువజేసి మాట్లాడకూడదు.
ముఖ్యంగా పిల్లలకు సరైన అవగాహన ఏర్పడే వరకు,తల్లితండ్రుల పట్ల భయం, భక్తి, ప్రేమ కలిగేలా చూడాలి కానీ,అతి చనువు ఇవ్వకూడదు. బాల్యంలో అడిగినంత డబ్బులివ్వడమంటే
వారిని మనం మన చేతులారా పాడుచేసినట్లే. పిల్లలు తల్లితండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారంటే ,వారికి మీరు అతి స్వేఛ్ఛ ఇచ్చినట్లే. పిల్లలకు చిన్నప్పటినుండే డబ్బు విలువ, మాట విలువ, మనిషి విలువ నేర్పాలి.
మీరు మీ ఖాళీ సమయంలో లాప్ టాప్ లు ముందువేసుకు కూర్చొనేముందు, నాలుగు మంచి మాటలు ,కనీసం ఒక నీతి కథైనా చెప్పాలి.
పిల్లలకు చదువు ముఖ్యమే కానీ, చదువుతో పాటుగా
లోకజ్ఞానం వుండాలి. పదిమందిలో వున్నప్పుడు ఎలా వుండాలన్నది, ఇంటికి వచ్చిన బంధువులను ఎలా గౌరవించిలన్నది
తప్పకుండా నేర్పాలి.
అతి గారాబం అనర్థదాయకం, అలాగే అతిగా శిక్షించడం కూడా అనర్థమే!
అడగగానే కొండమీద కోతైనా వస్తుంది అనే భావన పిల్లలలో కలగ కూడదు.వారి పట్ల మీకు అతి ప్రేమవుందనే విషయం వారికి తెలిస్తే, దాన్ని వారు దుర్వినియోగం చేస్తారు. మనం చూస్తూనేవున్నాం అలా పెరిగిన పిల్లలు ఎలా తయారై, తల్లితండ్రులను ఎలా బాధ పెడుతున్నదీ చూస్తునేవున్నాం.
పిల్లల సరదాలు తీర్చటం తప్పులేదు. తీర్చాలి కూడా. అలా తీర్చలేనంత మాత్రాన వారుమిమ్మల్ని నిరసన చేేసే విధంగా వారు తయారు కాకుండా పెంచే భాద్యత కూడా మీదే!
ఈ విషయాలన్నీ పెద్ద చదువులు చదువుకొన్న మీ వంటి భార్యా భర్తలకు తెలియవని కాదు కానీ ,పిల్లల విషయంలో మీ భార్యా భర్తలది ఒకేమాట అన్న విషయం మీరు మీ పిల్లలకు కలిగించలేకపోతున్నారు నేటి మీవంటి భార్యాభర్తలు. అదే యీనాడుపిల్లలు పెడమార్గం పట్టడానికి కారణమౌతోంది. నేటి పిల్లలకు ,తండ్రంటే భయం లేదు, తల్లంటే గౌరవం లేదు.
ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు గతిలేక వచ్చినట్లు, అనవసర బర్డెన్ గానూ భావిస్తున్నారంటే ,మీరు బంధువుల పట్లా,చుట్టాలపట్లా వారికి అవగాహన కలిగించడం లేదని అర్థం.
ఇక ఆఫర్లంటూ షాపులు ప్రకటిస్తే, అవి మనకు అవసరమా కాదా అన్న ఆలోచన లేకుండా కొనెయ్యడం.వాడే టైమ్ దాటిపోయిందంటూ నిర్లక్ష్యంగా పారేయడం.బట్టలు కొనడానికైతే హద్దేలేదు. ఇలా తొడగడం,అలా పారెయ్యడం. వేలరూపాయలు పెట్టి బట్టలు కొనేటప్పుడు ,అవి ఎన్ని రోజుల వరకూ పనికొస్తాయన్నది కూడా ఆలోచించి కొనాలి.
చినుకు చినుకు చేరితేనే చెరువులో నీరుంటుంది. లేకపోతే చెరువెండిపోతుంది. డబ్బుకూడా అంతే, రూపాయికి రూపాయి కలిపితేనే పొదుపౌతుంది. పిల్లలు పెరుగుతుంటే ముందు ముందు అధిక ఖర్చులే, రూపాయి రూపాయి కలిస్తే పాపాయెత్తు డబ్బౌతుంది అని సామెత.
మనిషికి ఉన్నది బలము, గొడ్డుకు తిన్నది బలము అంటారు. అందుకని డబ్బు విషయంలో ముందు జాగ్రత్త అవసరం.
నేను చెప్పిన విషయాలన్నీ మీ బాగుకోసం చెప్పినవే. కోపగించుకోవని తెలుసు.
ఎదురుగానే చెప్పకపోయావా అంటావేమో? నేను ఉత్తరంలో వ్రాసినట్లు ముఖా ముఖీ చెప్పలేను. నేను చెప్పినపుడు మీరు మొఖం
చిట్లించినా నా మనసు గాయపడుతుంది. ఆపై చెప్పాలన్న విషయాలు చెప్పలేక పోవచ్చు.
అవసరమనుకొంటే కోడలికి కూడా ఈ లేఖ చూపించు. ముందులోనే చెప్పినట్లు, అవసరమనుకొంటే ఆచరించు. లేదూ, అమ్మదంతా చాదస్తం అంటే చింపి పారెయ్ .
వుంటాను
సదా నీ క్షేమం కోరే
అమ్మ
ఒక మిత్రుడు fb లో ప్రచు
రించారు . రచయితకూ
సేకరించిన సదరు మి
త్రునికీ ధన్యవాదములు .
అందరూ చదువ దగ్గది .
*****************
చిరంజీవి ------- కి,
అమ్మ దీవించి వ్రాయునది.
నేను క్షేమంగానే ఇల్లు చేరాను. కోడలు ,పిల్లలు కులాసా అని తలుస్తాను.
నా అంతవాడివి నువ్వైయ్యావు,
నీ కుటుంబం నీది.
మీ ఇంట్లో మీరు మీకు నచ్చినట్లు నడచుకొంటారు. కానీ,తల్లిగా నీకు ఇష్టంవున్నా లేకపోయినా కొన్ని విషయాలు చెపుదామనుకొంటున్నాను.
నచ్చితే విను.
నచ్చకపోతే వదిలెయ్ .
పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. వాళ్ళని మీరు ఎలా తయారుచేస్తేవాళ్ళు అలా తయారౌతారు.
ముఖ్యంగా మీ భార్యా భర్తలిద్దరూ ఒక విషయం గ్రహించాలి.
పిల్లలెదురుగుండా మీరు ఆర్థిక విషయాలు మాట్లాడుకొని, అసహనంగా మాటలు విసురుకోరాదు. వారి ఎదురుగా, నువ్వెక్కువంటే నువ్వు తక్కువ అనుకోకూడదు.
చుట్టాల గురించీ, బంధువుల గురించీ చులకన చేసి మాట్లాడకూడదు.
అలాగే,వాళ్ళు చదువుతున్న స్కూలు గురించీ, టీచర్ల గురించీ తక్కువజేసి మాట్లాడకూడదు.
ముఖ్యంగా పిల్లలకు సరైన అవగాహన ఏర్పడే వరకు,తల్లితండ్రుల పట్ల భయం, భక్తి, ప్రేమ కలిగేలా చూడాలి కానీ,అతి చనువు ఇవ్వకూడదు. బాల్యంలో అడిగినంత డబ్బులివ్వడమంటే
వారిని మనం మన చేతులారా పాడుచేసినట్లే. పిల్లలు తల్లితండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారంటే ,వారికి మీరు అతి స్వేఛ్ఛ ఇచ్చినట్లే. పిల్లలకు చిన్నప్పటినుండే డబ్బు విలువ, మాట విలువ, మనిషి విలువ నేర్పాలి.
మీరు మీ ఖాళీ సమయంలో లాప్ టాప్ లు ముందువేసుకు కూర్చొనేముందు, నాలుగు మంచి మాటలు ,కనీసం ఒక నీతి కథైనా చెప్పాలి.
పిల్లలకు చదువు ముఖ్యమే కానీ, చదువుతో పాటుగా
లోకజ్ఞానం వుండాలి. పదిమందిలో వున్నప్పుడు ఎలా వుండాలన్నది, ఇంటికి వచ్చిన బంధువులను ఎలా గౌరవించిలన్నది
తప్పకుండా నేర్పాలి.
అతి గారాబం అనర్థదాయకం, అలాగే అతిగా శిక్షించడం కూడా అనర్థమే!
అడగగానే కొండమీద కోతైనా వస్తుంది అనే భావన పిల్లలలో కలగ కూడదు.వారి పట్ల మీకు అతి ప్రేమవుందనే విషయం వారికి తెలిస్తే, దాన్ని వారు దుర్వినియోగం చేస్తారు. మనం చూస్తూనేవున్నాం అలా పెరిగిన పిల్లలు ఎలా తయారై, తల్లితండ్రులను ఎలా బాధ పెడుతున్నదీ చూస్తునేవున్నాం.
పిల్లల సరదాలు తీర్చటం తప్పులేదు. తీర్చాలి కూడా. అలా తీర్చలేనంత మాత్రాన వారుమిమ్మల్ని నిరసన చేేసే విధంగా వారు తయారు కాకుండా పెంచే భాద్యత కూడా మీదే!
ఈ విషయాలన్నీ పెద్ద చదువులు చదువుకొన్న మీ వంటి భార్యా భర్తలకు తెలియవని కాదు కానీ ,పిల్లల విషయంలో మీ భార్యా భర్తలది ఒకేమాట అన్న విషయం మీరు మీ పిల్లలకు కలిగించలేకపోతున్నారు నేటి మీవంటి భార్యాభర్తలు. అదే యీనాడుపిల్లలు పెడమార్గం పట్టడానికి కారణమౌతోంది. నేటి పిల్లలకు ,తండ్రంటే భయం లేదు, తల్లంటే గౌరవం లేదు.
ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు గతిలేక వచ్చినట్లు, అనవసర బర్డెన్ గానూ భావిస్తున్నారంటే ,మీరు బంధువుల పట్లా,చుట్టాలపట్లా వారికి అవగాహన కలిగించడం లేదని అర్థం.
ఇక ఆఫర్లంటూ షాపులు ప్రకటిస్తే, అవి మనకు అవసరమా కాదా అన్న ఆలోచన లేకుండా కొనెయ్యడం.వాడే టైమ్ దాటిపోయిందంటూ నిర్లక్ష్యంగా పారేయడం.బట్టలు కొనడానికైతే హద్దేలేదు. ఇలా తొడగడం,అలా పారెయ్యడం. వేలరూపాయలు పెట్టి బట్టలు కొనేటప్పుడు ,అవి ఎన్ని రోజుల వరకూ పనికొస్తాయన్నది కూడా ఆలోచించి కొనాలి.
చినుకు చినుకు చేరితేనే చెరువులో నీరుంటుంది. లేకపోతే చెరువెండిపోతుంది. డబ్బుకూడా అంతే, రూపాయికి రూపాయి కలిపితేనే పొదుపౌతుంది. పిల్లలు పెరుగుతుంటే ముందు ముందు అధిక ఖర్చులే, రూపాయి రూపాయి కలిస్తే పాపాయెత్తు డబ్బౌతుంది అని సామెత.
మనిషికి ఉన్నది బలము, గొడ్డుకు తిన్నది బలము అంటారు. అందుకని డబ్బు విషయంలో ముందు జాగ్రత్త అవసరం.
నేను చెప్పిన విషయాలన్నీ మీ బాగుకోసం చెప్పినవే. కోపగించుకోవని తెలుసు.
ఎదురుగానే చెప్పకపోయావా అంటావేమో? నేను ఉత్తరంలో వ్రాసినట్లు ముఖా ముఖీ చెప్పలేను. నేను చెప్పినపుడు మీరు మొఖం
చిట్లించినా నా మనసు గాయపడుతుంది. ఆపై చెప్పాలన్న విషయాలు చెప్పలేక పోవచ్చు.
అవసరమనుకొంటే కోడలికి కూడా ఈ లేఖ చూపించు. ముందులోనే చెప్పినట్లు, అవసరమనుకొంటే ఆచరించు. లేదూ, అమ్మదంతా చాదస్తం అంటే చింపి పారెయ్ .
వుంటాను
సదా నీ క్షేమం కోరే
అమ్మ
30, సెప్టెంబర్ 2017, శనివారం
విజయదశిమి - నేడు - విజయోస్తు జగతికి .....
పుడమిని పోరాడి దుర్గ పున్నెపు ప్రోవై
కడుకొని మంచికి విజయము
గడియించెను మార్గ దర్శిగా నిల్చి సదా .
చెడుపై పోరాడు డటం
చడుగడుగున విజయ దశమి సందేశ మిడున్
చెడుపై పోరాడుటయే
పుడమి జనులు దుర్గ గొలిచి పూజించు టగున్ .
ఏటేటా విజయ దశమి
పాటింతుము గాని దాని పరమార్థమ్మున్
దీటుగ పాటించ గలుగు
నాట గదా ! విజయ దశమి నవ్యత దాల్చున్ .
మన దాకా వచ్చు వరకు
మనకేమీ పట్టనట్లు మనుట విడిచి , చెం
తన గల చెడునెదిరించిన
ఘనవిజయము వచ్చు మంచి ఘనమై నిలుచున్
అమ్మ చెప్పినదిది , నమ్మి తనంతగా
నెవడు పూని సత్య నిష్ట గలిగి
చెడును పట్టుపట్టి చీల్చి చెండాడునో
వాని కండ నిలుచు వచ్చి దుర్గ .
28, సెప్టెంబర్ 2017, గురువారం
తల్లీ ! దుర్గమ్మా ! వందనాలు .
దురిత దూర , 'దుర్గ' , దుర్మార్గ నాశని ,
దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
సకల జగతి నేలు సాంద్ర కరుణ .
తరణిని తారాధి పతిని
తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
పరదేవతను మనంబున
పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .
అమ్మా యని ఆర్తి గదుర
అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
అమ్మతనపు వాత్సల్యము
క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .
దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
సకల జగతి నేలు సాంద్ర కరుణ .
తరణిని తారాధి పతిని
తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
పరదేవతను మనంబున
పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .
అమ్మా యని ఆర్తి గదుర
అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
అమ్మతనపు వాత్సల్యము
క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .
27, సెప్టెంబర్ 2017, బుధవారం
మాతా సరస్వతీ .....
నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా మాత ! వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,
జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .
పాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
హంస నెక్కి తిరుగు నజుని రాణి !
మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
మమ్ము గావు మమ్మ ! మంజు వాణి .
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా మాత ! వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,
జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .
పాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
హంస నెక్కి తిరుగు నజుని రాణి !
మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
మమ్ము గావు మమ్మ ! మంజు వాణి .
విన్నపాలు వినవలె ....
పలు భాషల పరిచయములు
పలు గ్రంథాంతర పరిచయ ప్రావీణ్యములున్
పలు దేశ విశేషానుభ
వ లసద్బుధులుగ 'జిలేబి'వారిని దలతున్
అందరము పెద్దవయసులో కడుగిడితిమి
ఆట విడుపుగ నిట నొక చోట చేరి
కదిసి మచ్చటించు తరిని కాస్తటు నిటు
మాట లొలుకుట సహజమ్ము మాన్యచరిత !
వారం రోజులు మీమీ
తీరులు తెన్నులు దెలియక తికమక పడి యే
తీరున నుండిరొ యని హితు
లారయ వెదుకాడిరి హితురాలని కాదా ?
పెద్దవారు శర్మ పేరిమి విడువరు
కూరిమి మనసార కోరుచుంద్రు
క్లేశ మొంది కూడ క్షీరధవళశోభ
తరుగదు మనసున గురు విభవులు .
హాస్య భాషణమ్ము లపహాస్య మవనీక
కట్టడించు కొనగ కష్ట మేమి ?
చతుర భాషణమున చాతుర్య మబ్బిన
తమకు సాధ్య మవని దారి గలదె !
పల్లాయి బల్కు 'సుగుణము'
పల్లికిలించుటలకంటె 'పరమ ఘనం'బౌ
నెల్లెడల పనికిరా దది
తల్లీ!విడువంగ నగును తమరికనైన్ .
పలు గ్రంథాంతర పరిచయ ప్రావీణ్యములున్
పలు దేశ విశేషానుభ
వ లసద్బుధులుగ 'జిలేబి'వారిని దలతున్
అందరము పెద్దవయసులో కడుగిడితిమి
ఆట విడుపుగ నిట నొక చోట చేరి
కదిసి మచ్చటించు తరిని కాస్తటు నిటు
మాట లొలుకుట సహజమ్ము మాన్యచరిత !
వారం రోజులు మీమీ
తీరులు తెన్నులు దెలియక తికమక పడి యే
తీరున నుండిరొ యని హితు
లారయ వెదుకాడిరి హితురాలని కాదా ?
పెద్దవారు శర్మ పేరిమి విడువరు
కూరిమి మనసార కోరుచుంద్రు
క్లేశ మొంది కూడ క్షీరధవళశోభ
తరుగదు మనసున గురు విభవులు .
హాస్య భాషణమ్ము లపహాస్య మవనీక
కట్టడించు కొనగ కష్ట మేమి ?
చతుర భాషణమున చాతుర్య మబ్బిన
తమకు సాధ్య మవని దారి గలదె !
పల్లాయి బల్కు 'సుగుణము'
పల్లికిలించుటలకంటె 'పరమ ఘనం'బౌ
నెల్లెడల పనికిరా దది
తల్లీ!విడువంగ నగును తమరికనైన్ .
26, సెప్టెంబర్ 2017, మంగళవారం
అన్నవరం సత్యదేవుని సందర్శనం.
రత్నగిరీశ్వరున్ గొలువ రమ్మని బిల్చిన బిడ్డవెంట నే
న్నూత్న మనో విభూతి వలనొప్పగ వెళ్ళితి , నెంత వేడుకో !
యత్నము సాంతమున్ మదికి హాయి నొసంగెను , జన్మ పుణ్యముల్
నూత్నములై యదృష్టముల నొక్కెడ గూర్చిన భాగ్య మొప్పగా -
కను విందుగా క్రింది గర్భాలయమ్ములో
శ్రీచక్రయుతముగా చెలువు మెరయ
బ్రహ్మాది దేవతల్ పడి పడి మ్రొక్కిన
పాదాలు గంటిని పరవశమున
కడు శోభనము పైన గర్భాలయమ్ములో
శివ , రమా మూర్తులు చేరి కొలువ
మధ్యలో కొలువైన మహనీయ మూర్తి ము
ఖమును గంటిని నాదు కర్మ తొలగె
అన్నవరము యాత్ర మిన్నయై మదిదోచె
కన్నుల కొక పుణ్య మున్న కతన
జన్మ ధన్య మయ్యె , సత్యదేవు మహా ప్ర
సాదము దొరికినది , సకల శుభము .
సత్య దేవు నెదుట సాగిలి మ్రొక్కితి
వ్రతము సేయు భక్త వరుల గంటి
వెలయు కొండ మీది యిలను వైకుంఠమ్ము
కన్నులార గంటి కరవు దీరె .
24, సెప్టెంబర్ 2017, ఆదివారం
పురుహూతికా దేవి దర్శన భాగ్యం లభించింది .
పిఠాపురం వెళ్ళేను ,
పురుహూతికా సతీదేవిని దర్శించుకున్నాను .
తన్మయత్వం చెందేను .
---------------------------
21, సెప్టెంబర్ 2017, గురువారం
ముగురమ్మల మూలపుటమ్మకు వందనం
ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు
ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు
ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .
15, సెప్టెంబర్ 2017, శుక్రవారం
కనియెన్ రుక్మిణి .....
కనియెన్ రుక్మిణి ' చంద్ర మండల ముఖున్ , కంఠీరవేంద్రావల
గ్ను , నవాంభోజ దళాక్షు , చారుతర వక్షున్ , మేఘ సంకాశ దే
హు , నగారాతి గజేంద్ర హస్త నిభ బాహున్ , చక్రి , పీతాంబరున్ ,
ఘన భూషాంకితు , కంబు కంఠు , విజయోత్సాహున్ , జగన్మోహనున్ ' .
------ బమ్మెర పోతన
భారతావని చల్లగా బ్రతుకు గాత !
హస్త సాముద్రికం బందించి భవితను
నేడె కళ్ళకు గట్టు నేర్చి యొకడు
జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి
గతుల నాపాదించు ఘను డొకండు
పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి
నెంబరు గేమాడు నేర్పరొకడు
తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ
నేమమ్ము గల మహనీయు డొకడు
అంద రున్నత కులజులే , అందులోను
శాస్త్ర పాండితీ ధిషణులే , చదువు నింత
గొప్పగా వాడుచున్నారు , గొప్ప వారె !
భారతావని చల్లగా బ్రతుకు గాత !
నేడె కళ్ళకు గట్టు నేర్చి యొకడు
జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి
గతుల నాపాదించు ఘను డొకండు
పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి
నెంబరు గేమాడు నేర్పరొకడు
తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ
నేమమ్ము గల మహనీయు డొకడు
అంద రున్నత కులజులే , అందులోను
శాస్త్ర పాండితీ ధిషణులే , చదువు నింత
గొప్పగా వాడుచున్నారు , గొప్ప వారె !
భారతావని చల్లగా బ్రతుకు గాత !
24, ఆగస్టు 2017, గురువారం
ఓం జయ గణేశాయ నమః
కొలిచిన వారికి కొండంత వేలుపై
సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి
పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి
కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి
ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి
ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి
కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై
మనసార దీవించు మహిత మూర్తి
మూడు గుంజీలు దీసినా మోదమంది
నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు
భక్త సులభుండు సకల సంపద ప్రదాత
శ్రీ గణేశుని తొలిపూజ చేసి కొలుతు .
14, ఆగస్టు 2017, సోమవారం
మాయ జేసెద వేమిరా ! మమ్ము కృష్ణ !
ఆడేవు దొంగాట ఆయశోదా దేవి
కొంగు మాటున జేరి రంగు మార్చి
కూడేవు సయ్యాట కోరిన రాధతో
పయ్యెద కొంగు నింపార విడక
పాడేవు మురళి రూపానల జ్వాల ర
గిల్చి జగముల నూగించి బ్రమల
మాడేవు గో గోప చూడా మణులతోడ
మామూలు బాలుడై మసలు కొనుచు
బుధ్ధి మంతుని పగిది రూపున యదేమి
యల్లరిర ? యయ్యొ ! గోపికల్ తల్లడిలిరి ,
జగతి నంతను మోహ విచలిత జేసి
మాయ జేయుదు వేమిరా ! మమ్ము కృష్ణ !
8, జులై 2017, శనివారం
గురు పౌర్ణమి .....
' వందే కృష్ణ జగద్గురుమ్ ' విమల విశ్వజ్ఞాన గీతార్యుకున్
వందే వ్యాసునికిన్ మహద్గురునికిన్ వందే చతుర్వేదకున్
వందే సాయికి సద్గురూత్తమునికిన్ వందే జగత్రాతకున్
వందే వెంకయ సామికిన్ మము సదా వర్దిల్లగా జూడగాన్
వందే వ్యాసునికిన్ మహద్గురునికిన్ వందే చతుర్వేదకున్
వందే సాయికి సద్గురూత్తమునికిన్ వందే జగత్రాతకున్
వందే వెంకయ సామికిన్ మము సదా వర్దిల్లగా జూడగాన్
7, జులై 2017, శుక్రవారం
చొక్కిన యొకజంట .....
తెలుగు పద్యం
-----------------
చొక్కిన యొకజంట చూచుకుంటున్నట్లు
పలుమార్లు చదివించు భ్రాంతి ముంచి
ప్రియమార నొకజంట పిలుచుకుంటున్నట్లు
చెవులలో నింపైన చవులు నింప
శ్రుతి మించి యొకజంట చుంబించు కొన్నట్లు
పెదవుల మాటల మధువు లద్ద
కసిదీర నొకజంట కౌగిలించుచు పొందు
నానంద రస మగ్న మనుభ వింప
ముద్దు మాటలు దొర్లించి ముదము గూర్చ
సొగసు టూహల భావ మంజూష నింపి
తియ్య మామిళ్ళు తేనెలో దిగిచి నట్లు
తెలుగు పద్యపు సౌరు వర్థిల్ల వలయు .
-----------------
చొక్కిన యొకజంట చూచుకుంటున్నట్లు
పలుమార్లు చదివించు భ్రాంతి ముంచి
ప్రియమార నొకజంట పిలుచుకుంటున్నట్లు
చెవులలో నింపైన చవులు నింప
శ్రుతి మించి యొకజంట చుంబించు కొన్నట్లు
పెదవుల మాటల మధువు లద్ద
కసిదీర నొకజంట కౌగిలించుచు పొందు
నానంద రస మగ్న మనుభ వింప
ముద్దు మాటలు దొర్లించి ముదము గూర్చ
సొగసు టూహల భావ మంజూష నింపి
తియ్య మామిళ్ళు తేనెలో దిగిచి నట్లు
తెలుగు పద్యపు సౌరు వర్థిల్ల వలయు .
6, జులై 2017, గురువారం
ఊహింపంబడె .....
ఊహింపంబడె నల్లనయ్య నలుపొక్కొక్కర్కియొక్కోటిగా
సాహిత్యానలతప్తులై యొకరు తా సారించి నల్పే తనన్
తా హీనంబుగనెంచి శ్యామలుని యొద్దంజేరెనం , చొక్క రా
శ్రీ హర్షుండు విముక్త కీర్తి సితుడై శ్రీ దేహుడైనట్లుగాన్ .
మరియు నొకరు విశ్వంబు మాడ్కి విశ్వ
విభుడును నలుపనె , జలద విభవ మొంది
శ్యామలుండయ్యె ననె నొక్క రా మదన జ
నకుని నైన సంశయము మానదు మనంబు .
వలచిన భామినీ మలయజ కలయ సం
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని
యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .
సాహిత్యానలతప్తులై యొకరు తా సారించి నల్పే తనన్
తా హీనంబుగనెంచి శ్యామలుని యొద్దంజేరెనం , చొక్క రా
శ్రీ హర్షుండు విముక్త కీర్తి సితుడై శ్రీ దేహుడైనట్లుగాన్ .
మరియు నొకరు విశ్వంబు మాడ్కి విశ్వ
విభుడును నలుపనె , జలద విభవ మొంది
శ్యామలుండయ్యె ననె నొక్క రా మదన జ
నకుని నైన సంశయము మానదు మనంబు .
వలచిన భామినీ మలయజ కలయ సం
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని
యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .
నల్లనివాడైన నమ్మినారు .....
జయ కృపారసము పైజల్లంగనే నీవు
నల్లనివాడైన నమ్మినారు
పద్మ నయనములు బరుపంగనే నీవు
నల్లనివాడైన నమ్మినారు
తలకట్టు పింఛంపు వలలు వేయంగనే
నల్లనివాడైన నమ్మినారు
నవ్వురాజిల్లు మో మివ్వటిల్లెడు నీవు
నల్లనివాడైన నమ్మినారు
నమ్మి చెల్వలు మానధనంబు లివ్వ
దోచుకొనిపోయి యెక్కడో దూరినావు
మల్లియల నడిగెద రాయమాయకులు , క
నియు కనుపడ వేమిర ! కమనీయ రూప !
4, జులై 2017, మంగళవారం
నీ కెలా గంటు కొనె నల్పు నీరజాక్ష !
దేవకీ వసుదేవు దేహచాయలు తెల్పు
నంద యశోద వర్ణాలు తెలుపు
రాధికా రమణీయ రాగబంధము తెల్పు
రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు
తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు
మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు
భారతాంతర్గత భావ జాలము తెల్పు
గీతామృతంపు సత్కీర్తి తెలుపు
బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !
నంద యశోద వర్ణాలు తెలుపు
రాధికా రమణీయ రాగబంధము తెల్పు
రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు
తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు
మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు
భారతాంతర్గత భావ జాలము తెల్పు
గీతామృతంపు సత్కీర్తి తెలుపు
బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !
3, జులై 2017, సోమవారం
ఎవరు చెప్పిరి నలుపని .....
వలచిన భామినీ మలయజ కలయ సం
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని
యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని
యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .
15, జూన్ 2017, గురువారం
మనోఙ్ఞమైన పద్యం
మనోఙ్ఞమైన సీసపద్యము
-------------------------------
అవగాహనేహా సమాయత్త విభుదరా
ట్కమనీయ మణి శతాంగములనంగ
తాటాక సేతు సందర్శనేచ్ఛా గత
స్థిత సమున్నత మహా శిఖరులనగ
నేతదుజ్వల ధరానేతృ సంపాదిత
మూర్తి భాస్వద్కీర్తి మూర్తులనగ
ముక్తా మణీ యుక్త మోహనాంబర చుంబి
వరుణ రాజన్య గోపురములనగ
నిలిపె గుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా కంబములు జెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్రశౌరి .
పై పద్యం భావం
-----------------
మా కుల్లూరి శీమ రాజ్యభార ధురంధరుండైన
చింతపట్ల రుద్రశౌరి మాయూరి నల్లచెరువుకు
ముప్పదిమూడు రాతిస్థంభాలతో అలుగు నిర్మిం
చెను . ఆ అలుగు వర్ణణ యిది .
క్రీ.శ. 1612లో
శిలాశాసనంలో వ్రాయబడి ఉంది .
సదరు చెరువులో మునగడానికి వచ్చి దేవతల
రాజు అచట నిలిపిన కమనీయ మణిమయ
రథము వలెనూ , తటాక సేతు సందర్శనేచ్చతో
వచ్చిన సందర్శకులకు శిఖరముల వలెనూ ,
ప్రకాశమానమైన కుల్లూరి శీమను పాలించిన
రాజులు సముపార్జించిన కీర్తి స్థంభాల వలెనూ ,
ముత్యములు మణులతో నిర్మితమై ఆకసము
నంటుచున్న వరుణదేవుని రాజమందిర గోపు
రముల వలెనూ అలుగు రాతిస్థంభములున్నవట .
ఈ శాసనం మాయూరి చెరువు అలుగు వద్ద ఇప్పటికీ నిలిచి ఉంది . శాలివాహనశకం 1534
పరీధావి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి సోమవారం అనగా క్రీ.శ.1612 న ఇది వ్రాయ
బడింది .
అప్పట్లో వీర వెంకట పతి రాయలు సామ్రాజ్య
మేలుతూ ఉండేవారు . వారి సామంతులుగా
ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశ ప్రభువు
వెలుగోటి వెంకటపతినాయనింగారు పాలించేవారు . రుద్రప్ప వీరి రాజ్యభార ధురందరుడు . అంటే సర్వ సైన్యాధ్యక్షులన్నమాట .
ఇదీ సంగతి .
ఈ శాసనంలో ఇంకో విశేషముంది .
శాలివాహన శకం 1534 అని వ్రాయడానకి
బదులుగా ---
' శాలివాహన శకే వార్ధిత్రిబాణేధరా సంఖ్యాకే '
అని వ్రాసి ఉంది . అనగా ----
వార్ధి = సముద్రాలు = 4
త్రి = 3
బాణ = 5
ధరా = 1
అంకానాం వామతో గతిః కాబట్టి
శాలివాహనశకం = 1534 అనుకోవాలి .
సంస్కృత శ్లోకం తర్వాత శాసనంలో
తెలుగు ప్రారంభించారు .
అక్కడ శాలివాహన శక వరుషంబులు 1534
అని తెలుగంకెలలో వ్రాయబడి ఉంది .
శ్రీ పంతుల గోపాల కృష్ణారావు గారు
ఒక టపాలో వివరించినట్లు
సున్న , అరసున్నలు తెలుపుటకు ---
సున్నతరువాత ద్విత్వం చేసి వ్రాసియున్నారు .
అలాంటి వాటిని నిండుసున్నగానూ ---
సున్న తరువాత ద్విత్వం వ్రాయని చోట్ల
అరసున్నగానూ చదువితే శాసనం సులభం
గా అర్థమయ్యింది . అనవసరమైన చోట్ల సున్నలెందుకు వ్రాస్తున్నారో , అవసరమైన చోట్ల సున్న తదుపరి ద్విత్వమెందుకు చేస్తున్నారో అర్థంగాక సతమత మయ్యేది . కాని , పంతులు గారి టపా సంశయాన్ని తొగించింది . వారికి కృతఙ్ఞతలు . ఇక రేఫను తదుపరి అక్షరానికి
ఆవల గిలకగా వ్రాయడం సరేసరి .
-------------------------------
అవగాహనేహా సమాయత్త విభుదరా
ట్కమనీయ మణి శతాంగములనంగ
తాటాక సేతు సందర్శనేచ్ఛా గత
స్థిత సమున్నత మహా శిఖరులనగ
నేతదుజ్వల ధరానేతృ సంపాదిత
మూర్తి భాస్వద్కీర్తి మూర్తులనగ
ముక్తా మణీ యుక్త మోహనాంబర చుంబి
వరుణ రాజన్య గోపురములనగ
నిలిపె గుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా కంబములు జెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్రశౌరి .
పై పద్యం భావం
-----------------
మా కుల్లూరి శీమ రాజ్యభార ధురంధరుండైన
చింతపట్ల రుద్రశౌరి మాయూరి నల్లచెరువుకు
ముప్పదిమూడు రాతిస్థంభాలతో అలుగు నిర్మిం
చెను . ఆ అలుగు వర్ణణ యిది .
క్రీ.శ. 1612లో
శిలాశాసనంలో వ్రాయబడి ఉంది .
సదరు చెరువులో మునగడానికి వచ్చి దేవతల
రాజు అచట నిలిపిన కమనీయ మణిమయ
రథము వలెనూ , తటాక సేతు సందర్శనేచ్చతో
వచ్చిన సందర్శకులకు శిఖరముల వలెనూ ,
ప్రకాశమానమైన కుల్లూరి శీమను పాలించిన
రాజులు సముపార్జించిన కీర్తి స్థంభాల వలెనూ ,
ముత్యములు మణులతో నిర్మితమై ఆకసము
నంటుచున్న వరుణదేవుని రాజమందిర గోపు
రముల వలెనూ అలుగు రాతిస్థంభములున్నవట .
ఈ శాసనం మాయూరి చెరువు అలుగు వద్ద ఇప్పటికీ నిలిచి ఉంది . శాలివాహనశకం 1534
పరీధావి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి సోమవారం అనగా క్రీ.శ.1612 న ఇది వ్రాయ
బడింది .
అప్పట్లో వీర వెంకట పతి రాయలు సామ్రాజ్య
మేలుతూ ఉండేవారు . వారి సామంతులుగా
ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశ ప్రభువు
వెలుగోటి వెంకటపతినాయనింగారు పాలించేవారు . రుద్రప్ప వీరి రాజ్యభార ధురందరుడు . అంటే సర్వ సైన్యాధ్యక్షులన్నమాట .
ఇదీ సంగతి .
ఈ శాసనంలో ఇంకో విశేషముంది .
శాలివాహన శకం 1534 అని వ్రాయడానకి
బదులుగా ---
' శాలివాహన శకే వార్ధిత్రిబాణేధరా సంఖ్యాకే '
అని వ్రాసి ఉంది . అనగా ----
వార్ధి = సముద్రాలు = 4
త్రి = 3
బాణ = 5
ధరా = 1
అంకానాం వామతో గతిః కాబట్టి
శాలివాహనశకం = 1534 అనుకోవాలి .
సంస్కృత శ్లోకం తర్వాత శాసనంలో
తెలుగు ప్రారంభించారు .
అక్కడ శాలివాహన శక వరుషంబులు 1534
అని తెలుగంకెలలో వ్రాయబడి ఉంది .
శ్రీ పంతుల గోపాల కృష్ణారావు గారు
ఒక టపాలో వివరించినట్లు
సున్న , అరసున్నలు తెలుపుటకు ---
సున్నతరువాత ద్విత్వం చేసి వ్రాసియున్నారు .
అలాంటి వాటిని నిండుసున్నగానూ ---
సున్న తరువాత ద్విత్వం వ్రాయని చోట్ల
అరసున్నగానూ చదువితే శాసనం సులభం
గా అర్థమయ్యింది . అనవసరమైన చోట్ల సున్నలెందుకు వ్రాస్తున్నారో , అవసరమైన చోట్ల సున్న తదుపరి ద్విత్వమెందుకు చేస్తున్నారో అర్థంగాక సతమత మయ్యేది . కాని , పంతులు గారి టపా సంశయాన్ని తొగించింది . వారికి కృతఙ్ఞతలు . ఇక రేఫను తదుపరి అక్షరానికి
ఆవల గిలకగా వ్రాయడం సరేసరి .
31, మే 2017, బుధవారం
మా కుల్లూరు -- ప్రాచీన శివాలయం
మా కుల్లూరు -- ప్రాచీన శివాలయం
------------------------------------------
మా కుల్లూరు గ్రామం చెరువు కట్ట క్రింద ,
అలుగుకూ - కోట శిథిలాలకూ మథ్య
ప్రాచీన శివాలయం శిథిలావస్థలో ఉండేది .
మా బాల్యంలో సదరు శిథిలాలలో ఆడుకునే
వాళ్ళం . శివాలయానికి ఉపయోగించిన గోధుమ
వర్ణపు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు ఊడి చెల్లా
చెదురుగా పడి ఉండేవి . నల్లరాతితో చెక్కబడి
నిగనిగలాడుతూ పెద్ద నంది విగ్రహం కూడా
ఉండేది . దానిని ముక్కలు చేసి దొంగలు
తరలించారని వినికిడి .
మా కుల్లూరు గ్రామస్థుడు , ప్రస్తుతం బెంగ
ళూరు నివాసి , పరమ ధార్మికుడు శ్రీ యాదాల
కృష్ణయ్య గారు పూనుకొని సదరు శివాలయాన్ని
సర్వాంగ సుందరంగా పునర్నిర్మిస్తున్నారు . తెల్లటి
గ్రానైట్ రాళ్ళు తెప్పించి , ఆలయ నిర్మాణం చేపట్టి
నారు . ఆలయానికి ముందు రాతి స్తంభాలతో సు
విశాలమైన మండప నిర్మాణం చేశారు . పూర్వం
వందల యేళ్ళనాటి మహారాజుల నిర్మాణ శైలిని
బోలి ఆలయం కను విందు చేస్తూ ఉంది .
మూడెకరాల సువిశాల ఆలయ ప్రాంగణ
మంతా వివిథ పూల మొక్కలతో , వృక్షాలతో
ఆలయం నయన మనోహరంగా రూపు దిద్దుకుం
టోంది . ఈ శివాలయం పేరు గంగాధరేశ్వరాల
యం . కృష్ణయ్య గారి జీవితం ధన్యం .
జీర్ణోధ్ధరణ సమయంలో ఈప్రదేశంలో
ఒక శిలాశాసనం బయల్పడి ఆలయంలో ప్రతి
ష్టింప బడింది . దీనిపైన శాసనం తమిళ లిపిలో
చెక్కబడి ఉంది . దీనిని తెలుగులోకి తర్జుమా
చేస్తే ఆలయానికి , గ్రామానికీ సంబంధించిన
సమాచారం తెలియగలదు . పాఠకులు ప్రయ
త్నించ గలరు .
శాసనం
-----------
మా కుల్లూరు -- శాసనాధారాలు
మా కుల్లూరు - శాసనాధారాలు
-------------------------------------
ఈ క్రింది శాసనం వెంకట పతి రాయలు ఈ
ప్రాంతాన రాజ్యం చేస్తున్నప్పటి కాలానిది .
ఇందులో శాలివాహన శక సంవత్సరం వ్రాయ
బడి ఉంది . 1574 అనుకుంటాను .
ఇది కుల్లూరు చెరువు అలుగు వద్ద ప్రతిష్టించ
బడినది .
సదరు రాజు చింతపట్ల రుద్రప్ప అనే చెరువుల నిర్మాణ నిపుణుని పిలిపించి కుల్లూరు నల్ల చెరువుకుఅలుగునిర్మించవలసినదిగాసబహుమానముగాఆనతివ్వడం , అతడు ముప్పది మూడు శిలాస్థంభములతో అలుగు నిర్మించడం ఈ శిలాశాసనంలోని అంశం .
ప్రసక్తాను ప్రసక్తంగా సదరు రుద్రప్ప అనంతసాగరం
చెరువు తూమును , కలువాయి చెరువు తూర్పు
అలుగును అంతకు ముందే నిర్మించి యున్నట్లు
ఈ శాసనంలో ఉట్టంకించ బడింది .
ఈ శాసనస్థ తెలుగు భాష కొద్దిపాటి తేడాలతో
ఇప్పటి తెలుగు భాషకు , లిపికి దగ్గరగా ఉంది .
ఇందులో చివర్న రుద్రప్పను పొగుడుతూ
ఒక సీస పద్యం కూడా ఉన్నట్లు నాకనిపించింది .
అక్షరాలు మసక బారడం వల్ల చాలవరకు స్పష్టత
కోల్పోయినవి . తేటగీతి పద్యం మాత్రం కాస్త
విస్పష్టంగా ఉంది .
తేటగీతి పద్యం
------------------
నిలిపె కుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా... లుంజెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్ర శౌరి .
శాసనం
---------
-------------------------------------
ఈ క్రింది శాసనం వెంకట పతి రాయలు ఈ
ప్రాంతాన రాజ్యం చేస్తున్నప్పటి కాలానిది .
ఇందులో శాలివాహన శక సంవత్సరం వ్రాయ
బడి ఉంది . 1574 అనుకుంటాను .
ఇది కుల్లూరు చెరువు అలుగు వద్ద ప్రతిష్టించ
బడినది .
సదరు రాజు చింతపట్ల రుద్రప్ప అనే చెరువుల నిర్మాణ నిపుణుని పిలిపించి కుల్లూరు నల్ల చెరువుకుఅలుగునిర్మించవలసినదిగాసబహుమానముగాఆనతివ్వడం , అతడు ముప్పది మూడు శిలాస్థంభములతో అలుగు నిర్మించడం ఈ శిలాశాసనంలోని అంశం .
ప్రసక్తాను ప్రసక్తంగా సదరు రుద్రప్ప అనంతసాగరం
చెరువు తూమును , కలువాయి చెరువు తూర్పు
అలుగును అంతకు ముందే నిర్మించి యున్నట్లు
ఈ శాసనంలో ఉట్టంకించ బడింది .
ఈ శాసనస్థ తెలుగు భాష కొద్దిపాటి తేడాలతో
ఇప్పటి తెలుగు భాషకు , లిపికి దగ్గరగా ఉంది .
ఇందులో చివర్న రుద్రప్పను పొగుడుతూ
ఒక సీస పద్యం కూడా ఉన్నట్లు నాకనిపించింది .
అక్షరాలు మసక బారడం వల్ల చాలవరకు స్పష్టత
కోల్పోయినవి . తేటగీతి పద్యం మాత్రం కాస్త
విస్పష్టంగా ఉంది .
తేటగీతి పద్యం
------------------
నిలిపె కుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా... లుంజెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్ర శౌరి .
శాసనం
---------
10, మే 2017, బుధవారం
అశ్రు నివాళి
అశ్రు నివాళి
--------------
మమతాను రాగాలు మనిషియై జన్మించి
ధన్యత గాంచిన తన్వి తాను
బంధు జనుల పట్ల బహు ప్రీతి జూపించి
తల లోన నాల్కయౌ తన్వి తాను
పేద సాదల కింత పెట్టు ధర్మ నిరతి
తనరారు చేతల తన్వి తాను
భర్తయు , బిడ్డల పటు ప్రేమ లను బొంది
తనిసి జీవించిన తన్వి తాను
ఇన్ని యిచ్చియు నారోగ్య మీని యీశ్వ
రుని చెయిదమును ప్రశ్నించ పనిగొని తను
నా సుభాషిణి దివికేగె -- నశ్రు జలము
లారవు నయనాల -- నివాళు లందు కొనుము .
--------------
మమతాను రాగాలు మనిషియై జన్మించి
ధన్యత గాంచిన తన్వి తాను
బంధు జనుల పట్ల బహు ప్రీతి జూపించి
తల లోన నాల్కయౌ తన్వి తాను
పేద సాదల కింత పెట్టు ధర్మ నిరతి
తనరారు చేతల తన్వి తాను
భర్తయు , బిడ్డల పటు ప్రేమ లను బొంది
తనిసి జీవించిన తన్వి తాను
ఇన్ని యిచ్చియు నారోగ్య మీని యీశ్వ
రుని చెయిదమును ప్రశ్నించ పనిగొని తను
నా సుభాషిణి దివికేగె -- నశ్రు జలము
లారవు నయనాల -- నివాళు లందు కొనుము .
19, ఏప్రిల్ 2017, బుధవారం
ఆవకాయ - అమరావతి
ఆవకాయ - అమరావతి
-----------------------------
భక్ష్య లేహ్య చోష్య బహువిథ భోజ్యాల
రుచులు చూచి చూచి రోత పుట్టి
నాల్క తుప్పు డుల్చు నవవిథ రుచి గూర్చి
తపము జేసె నొక్క ధార్మికుండు .
మంగళ గిరి ప్రాంతమునకు
చెంగట దిగి యతడు తపము జేయుచు నుండన్
రంగారు విపిన తలములు
క్రుంగంగా బారె నతని ఘోర తపమునన్ .
తపము బలము నింద్రు తాకెను , తనకేదొ
మూడె ననుచు నతడు ముగ్ధలైన
అప్సరోవనితల నంపె తపము గూల్చ
తలిరు బోడు లటకు తరలి రంత .
ఆమని యరుదెంచె నామ్ర తరువులన్ని
పూప పిందె బట్టి పొలుపు దాల్చె
రంభ కాయ గోసి రాగాల కారమ్ము
ఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .
మేనక ప్రియపడి మృదువుగా నందులో
నావ పిండి గలిపి చేవ గూర్చె
పప్పునూనె బోసె పరువాల యూర్వశి
రుచికి పడి ఘృతాచి లొట్ట సేసె .
అల్లంత దూరమందున
నుల్లము రంజిల్ల ' ఘాటు ' నోరూరించన్
కళ్లు దెరిచి వెళ్లి తబిసి
యల్లన రుచి చూచి తన్మయత్వము నందెన్ .
కొత్తావకాయ రుచి గని
తత్తర పడి తబిసి తపము ధన్యత గాంచన్
బిత్తరు లందరను గూడి
చిత్తము రంజిల్ల విడిది చేసెను తోటన్ .
పోయిన భామలు రాలే
దేమయినదొ యంచు నింద్ర దేవుడు వెదుకన్
ధీ మహితులు సురలందరు
భూమికి దిగి వచ్చి చూడ ' బొమ్మ ' కనబడెన్ .
తబిసి తలిరు బోళ్లు తనివార కొత్తావ
కాయ రుచులు గొనుచు కన బడి రట
దేవ గణము గూడి దేవాధిపతి గూడ
వచ్చి చేరి రుచికి మెచ్చి నారు .
ఆవ కాయ రుచికి యమరులు పరవశం
బంది స్వర్గ సీమ మరచి నారు
అచటె యుండి పోయి ' రమరావతి ' యనంగ
' నాంధ్ర రాజధాని ' యయ్యె నేడు .
-----------------------------
భక్ష్య లేహ్య చోష్య బహువిథ భోజ్యాల
రుచులు చూచి చూచి రోత పుట్టి
నాల్క తుప్పు డుల్చు నవవిథ రుచి గూర్చి
తపము జేసె నొక్క ధార్మికుండు .
మంగళ గిరి ప్రాంతమునకు
చెంగట దిగి యతడు తపము జేయుచు నుండన్
రంగారు విపిన తలములు
క్రుంగంగా బారె నతని ఘోర తపమునన్ .
తపము బలము నింద్రు తాకెను , తనకేదొ
మూడె ననుచు నతడు ముగ్ధలైన
అప్సరోవనితల నంపె తపము గూల్చ
తలిరు బోడు లటకు తరలి రంత .
ఆమని యరుదెంచె నామ్ర తరువులన్ని
పూప పిందె బట్టి పొలుపు దాల్చె
రంభ కాయ గోసి రాగాల కారమ్ము
ఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .
మేనక ప్రియపడి మృదువుగా నందులో
నావ పిండి గలిపి చేవ గూర్చె
పప్పునూనె బోసె పరువాల యూర్వశి
రుచికి పడి ఘృతాచి లొట్ట సేసె .
అల్లంత దూరమందున
నుల్లము రంజిల్ల ' ఘాటు ' నోరూరించన్
కళ్లు దెరిచి వెళ్లి తబిసి
యల్లన రుచి చూచి తన్మయత్వము నందెన్ .
కొత్తావకాయ రుచి గని
తత్తర పడి తబిసి తపము ధన్యత గాంచన్
బిత్తరు లందరను గూడి
చిత్తము రంజిల్ల విడిది చేసెను తోటన్ .
పోయిన భామలు రాలే
దేమయినదొ యంచు నింద్ర దేవుడు వెదుకన్
ధీ మహితులు సురలందరు
భూమికి దిగి వచ్చి చూడ ' బొమ్మ ' కనబడెన్ .
తబిసి తలిరు బోళ్లు తనివార కొత్తావ
కాయ రుచులు గొనుచు కన బడి రట
దేవ గణము గూడి దేవాధిపతి గూడ
వచ్చి చేరి రుచికి మెచ్చి నారు .
ఆవ కాయ రుచికి యమరులు పరవశం
బంది స్వర్గ సీమ మరచి నారు
అచటె యుండి పోయి ' రమరావతి ' యనంగ
' నాంధ్ర రాజధాని ' యయ్యె నేడు .
17, ఏప్రిల్ 2017, సోమవారం
మా కుల్లూరు -- 15
మా కుల్లూరు -- 15
---------------------
బలిజ కులము దొరలు , పలు ' గృహనామా 'ల
వాళ్ళు , కలిమి బలిమి గలిగి యిచట ,
సకల సంపదల , ప్రశాంత జీవనమును
గడపి నారు , నాటి కాల మందు .
తల్లి తరపు వాళ్ళు , తగని పౌరుష గాళ్ళు ,
' తోట ' వాళ్ళు , మాకు తొలి గురువులు ,
విద్య లందు గాని , విఙ్ఞానమున గాని ,
పధ్ధ తందు గాని బహు విదురులు .
' లక్కాకుల ' వాళ్ళ బలము
తక్కుంగల వాళ్ళ కంటె తగ నెక్కువ గా
లెక్కకు మిక్కిలి యుందురు
పక్కాగా చతుర వచన పటిమలు గలుగన్ .
' మాదాసు ' వాళ్ళు చదువుల
ప్రాథాన్యత సంపదలును భక్తియు గలుగన్ ,
' యాదాల ' వాళ్ళు గ్రామా
మోదముగల ప్రముఖులు , పుర ముఖ్యులు , మరియున్ ,
కార్య దక్షులు ' నలగండ్ల ' వాళ్ళందరు ,
' అందె ' వాళ్ళు సంప దందు ఘనులు ,
' చీర్ల ' వాళ్ళు ప్రతిభ శీలురు , మరియు ' రే
చర్ల ' వాళ్ళు బుధులు సర్వ విథుల .
' దరిమడుగు ' వాళ్ళు పండితుల్ , ' దర్శి ' వాళ్ళు
తీర్పరులు , ' సాదు ' వాళ్ళు ప్రదీప మతులు ,
ఘనులు ' దారము ' వాళ్ళు ప్రాకట యశముల ,
' అచ్యుతుల్ ' ఘనులు వివిథ కళాత్మ కతల .
వ్యాపార కళా దక్షులు
చూపుల ' కంబాల ' వాళ్ళు , ' సుంకర ' వాళ్ళున్
ప్రాపు వహించిరి , హిత ని
క్షేపాలు ' సుసర్ల ' వాళ్ళు , ' శీలము ' వాళ్ళున్ .
---------------------
బలిజ కులము దొరలు , పలు ' గృహనామా 'ల
వాళ్ళు , కలిమి బలిమి గలిగి యిచట ,
సకల సంపదల , ప్రశాంత జీవనమును
గడపి నారు , నాటి కాల మందు .
తల్లి తరపు వాళ్ళు , తగని పౌరుష గాళ్ళు ,
' తోట ' వాళ్ళు , మాకు తొలి గురువులు ,
విద్య లందు గాని , విఙ్ఞానమున గాని ,
పధ్ధ తందు గాని బహు విదురులు .
' లక్కాకుల ' వాళ్ళ బలము
తక్కుంగల వాళ్ళ కంటె తగ నెక్కువ గా
లెక్కకు మిక్కిలి యుందురు
పక్కాగా చతుర వచన పటిమలు గలుగన్ .
' మాదాసు ' వాళ్ళు చదువుల
ప్రాథాన్యత సంపదలును భక్తియు గలుగన్ ,
' యాదాల ' వాళ్ళు గ్రామా
మోదముగల ప్రముఖులు , పుర ముఖ్యులు , మరియున్ ,
కార్య దక్షులు ' నలగండ్ల ' వాళ్ళందరు ,
' అందె ' వాళ్ళు సంప దందు ఘనులు ,
' చీర్ల ' వాళ్ళు ప్రతిభ శీలురు , మరియు ' రే
చర్ల ' వాళ్ళు బుధులు సర్వ విథుల .
' దరిమడుగు ' వాళ్ళు పండితుల్ , ' దర్శి ' వాళ్ళు
తీర్పరులు , ' సాదు ' వాళ్ళు ప్రదీప మతులు ,
ఘనులు ' దారము ' వాళ్ళు ప్రాకట యశముల ,
' అచ్యుతుల్ ' ఘనులు వివిథ కళాత్మ కతల .
వ్యాపార కళా దక్షులు
చూపుల ' కంబాల ' వాళ్ళు , ' సుంకర ' వాళ్ళున్
ప్రాపు వహించిరి , హిత ని
క్షేపాలు ' సుసర్ల ' వాళ్ళు , ' శీలము ' వాళ్ళున్ .
16, ఏప్రిల్ 2017, ఆదివారం
మా కుల్లూరు -- 14
మా కుల్లూరు -- 14
----------------
పోలేరమ్మకు ప్రక్కన
నాలో నొక గుడియు నుండె , నంకమ్మది , యే
కాలముదో , పాడయ్యెను ,
శ్రీలొలుకగ దాని గట్టె శేషయ్య కడున్ .
ఎగువ పాళె మందు భగవతి మహలక్ష్మి
కొలువు దీరె మహిమ గలుగు తల్లి
అచటి భక్తులెల్ల రామెకు కైంకర్య
మొనర జేయు చుంద్రు ఘనము గాగ .
చెరువుకు కోటకు మథ్యన
పరమ శివుని గుడి గలదు , శివార్చన పరు లా
వర రాజాన్వయు లెవరో
చిరకీర్తులు గట్టి రెపుడొ , శిథిలం బయ్యెన్ .
అదిగొ శివుని గుడిని యాదాల కృష్ణయ్య
పట్టు బట్టి మరల గట్టి నాడు
భక్త తతులు వచ్చి పరమేశు పూజలు
జరుగు చున్న వచట చాల ఘనము .
----------------
పోలేరమ్మకు ప్రక్కన
నాలో నొక గుడియు నుండె , నంకమ్మది , యే
కాలముదో , పాడయ్యెను ,
శ్రీలొలుకగ దాని గట్టె శేషయ్య కడున్ .
ఎగువ పాళె మందు భగవతి మహలక్ష్మి
కొలువు దీరె మహిమ గలుగు తల్లి
అచటి భక్తులెల్ల రామెకు కైంకర్య
మొనర జేయు చుంద్రు ఘనము గాగ .
చెరువుకు కోటకు మథ్యన
పరమ శివుని గుడి గలదు , శివార్చన పరు లా
వర రాజాన్వయు లెవరో
చిరకీర్తులు గట్టి రెపుడొ , శిథిలం బయ్యెన్ .
అదిగొ శివుని గుడిని యాదాల కృష్ణయ్య
పట్టు బట్టి మరల గట్టి నాడు
భక్త తతులు వచ్చి పరమేశు పూజలు
జరుగు చున్న వచట చాల ఘనము .
14, ఏప్రిల్ 2017, శుక్రవారం
మా కుల్లూరు -- 13
మా కుల్లూరు -- 13
---------------
వర్తకుల వీథిలో నొక భజన చౌక
యుండెడిది , దాని పైన మా యూరి వాళ్ళు
శిరిడి సాయికి గుడిగట్టి సేవజేసి
కొలుచు చున్నారు గొప్పగా తలచి తలచి .
సాయి బాబ గుడిని సత్యనారాయణ
పూని నిర్వహించి పూర్తి జేసె
ఖర్చు కొఱకు తిరిగి కాళ్ళరిగి పోయినా
జన్మ ధన్య మయ్యె చాల వరకు .
అమరా సుబ్బారావను
విమలాత్ముడు , బాబ భక్త వినుతుండు , కడున్
శ్రమకోర్చి , దిన దినమ్మును
కమనీయముగా నొనర్చు కైంకర్యములన్ .
వినుతి కెక్క గట్టె వెంకయ్య స్వామికి
గుడిని భక్త జనులు కొలిచి తలువ
నాగరాజుపల్లి నాగేశ్వరుడు పూని
పూర్వ జన్మ ఫలము పుణ్య ఫలము .
వేడుకగా విఘ్నేశ్వరు
నాగుడిలో నిల్పె , మా సుధాకరుడు , మహా
భాగుడు , స్తవనీయ యశో
సాగరుడును , తోట వంశ జలనిధి శశియున్ .
---------------
వర్తకుల వీథిలో నొక భజన చౌక
యుండెడిది , దాని పైన మా యూరి వాళ్ళు
శిరిడి సాయికి గుడిగట్టి సేవజేసి
కొలుచు చున్నారు గొప్పగా తలచి తలచి .
సాయి బాబ గుడిని సత్యనారాయణ
పూని నిర్వహించి పూర్తి జేసె
ఖర్చు కొఱకు తిరిగి కాళ్ళరిగి పోయినా
జన్మ ధన్య మయ్యె చాల వరకు .
అమరా సుబ్బారావను
విమలాత్ముడు , బాబ భక్త వినుతుండు , కడున్
శ్రమకోర్చి , దిన దినమ్మును
కమనీయముగా నొనర్చు కైంకర్యములన్ .
వినుతి కెక్క గట్టె వెంకయ్య స్వామికి
గుడిని భక్త జనులు కొలిచి తలువ
నాగరాజుపల్లి నాగేశ్వరుడు పూని
పూర్వ జన్మ ఫలము పుణ్య ఫలము .
వేడుకగా విఘ్నేశ్వరు
నాగుడిలో నిల్పె , మా సుధాకరుడు , మహా
భాగుడు , స్తవనీయ యశో
సాగరుడును , తోట వంశ జలనిధి శశియున్ .
13, ఏప్రిల్ 2017, గురువారం
మా కుల్లూరు -- 12
మా కుల్లూరు -- 12
----------------------
చెంచయ్య శెట్టి మా చిరకాల సర్పంచి
చల్ల చెన్నారెడ్డి సరి మునసుబు
అందె చెన్నప శెట్టి యరుదైన కామందు
బిస్సాటి రోశయ్య ప్రియ కరణము
మాదాసు సోదరుల్ మారాజు లన్నింట
యాదాల రోశయ్య యలఘు శెట్టి
కంబాల గురుమూర్తి ఘనుడైన వ్యాపారి
దువ్వూరి కిచ్చమ్మ దొడ్డ మనిషి
దర్శి చెంచురామయ్య భూధవుడు మిగుల
ఊరు వూరంత ధనికులే , వీరు గాక
నాడు పేరైన పెద్ద లెందరొ గలుగుట
చేత కుల్లూరు మిగుల ప్రఖ్యాతి గాంచె .
చదువుకు తన సర్వస్వము
వదులు కొనుట కైన సిధ్ధ పడె , వదాన్యుం
డది గరుడయ్యెకె చెల్లును
సదయుడు కాలేజి కొరకు సంపద లిచ్చెన్ .
హైస్కూలు కాలేజి కన్నియుం గూర్చెను
హాస్పిటల్ దెప్పించి హాయి గూర్చె
వీథి వీథికి రోడ్లు వేయించె గొప్పగా
పెన్న నీళ్ళిప్పించి ప్రియము గూర్చె
చెన్నకేశవ గుడి చెన్నొంద గట్టించె
పూజాధికముల విభూతి గూర్చె
అభయాంజనేయుని యరుదైన నలువది
యడుగుల విగ్రహం బరయ గూర్చె
నేడు మాయూరి కొక్కరే నేత , యంద
రకును , మాదాసు గంగాధరం హితుండు ,
కోరి తన యూరి యభివృధ్ధి కొరకె గాక ,
ప్రాంతమును గూడ యభివృధ్ధి బరచు చుండు .
----------------------
చెంచయ్య శెట్టి మా చిరకాల సర్పంచి
చల్ల చెన్నారెడ్డి సరి మునసుబు
అందె చెన్నప శెట్టి యరుదైన కామందు
బిస్సాటి రోశయ్య ప్రియ కరణము
మాదాసు సోదరుల్ మారాజు లన్నింట
యాదాల రోశయ్య యలఘు శెట్టి
కంబాల గురుమూర్తి ఘనుడైన వ్యాపారి
దువ్వూరి కిచ్చమ్మ దొడ్డ మనిషి
దర్శి చెంచురామయ్య భూధవుడు మిగుల
ఊరు వూరంత ధనికులే , వీరు గాక
నాడు పేరైన పెద్ద లెందరొ గలుగుట
చేత కుల్లూరు మిగుల ప్రఖ్యాతి గాంచె .
చదువుకు తన సర్వస్వము
వదులు కొనుట కైన సిధ్ధ పడె , వదాన్యుం
డది గరుడయ్యెకె చెల్లును
సదయుడు కాలేజి కొరకు సంపద లిచ్చెన్ .
హైస్కూలు కాలేజి కన్నియుం గూర్చెను
హాస్పిటల్ దెప్పించి హాయి గూర్చె
వీథి వీథికి రోడ్లు వేయించె గొప్పగా
పెన్న నీళ్ళిప్పించి ప్రియము గూర్చె
చెన్నకేశవ గుడి చెన్నొంద గట్టించె
పూజాధికముల విభూతి గూర్చె
అభయాంజనేయుని యరుదైన నలువది
యడుగుల విగ్రహం బరయ గూర్చె
నేడు మాయూరి కొక్కరే నేత , యంద
రకును , మాదాసు గంగాధరం హితుండు ,
కోరి తన యూరి యభివృధ్ధి కొరకె గాక ,
ప్రాంతమును గూడ యభివృధ్ధి బరచు చుండు .
12, ఏప్రిల్ 2017, బుధవారం
మా కుల్లూరు -- 11
మా కుల్లూరు -- 11
---------------------
నెల్లూరు దాటి వచ్చిన
కుల్లూరే దిక్కు , చదువు కొనుటకు , చాలా
పల్లెలు , నెల్లూరు కడప
జిల్లా వాళ్ళిటకు వచ్చి చేరిరి చదువన్ .
వరద రాజులు నాయుడు వంటి వారు
చేరి హెడ్మాష్టరుగ పని చేసి రిచట ,
కోరి గంగాధరం లాంటి గొప్పవారు
చేరి చదివిరి ఘనులైరి తేరి చూడ .
ఎందరో ఘను లీ స్కూలు నందు జదివి
యున్నతిని బొంది రేనున్ను నుద్యమించి
కోరుకొని వచ్చి యభివృధ్ధి గూర్చి నాడ
కూడి గంగాధరం గారు తోడు నిలువ .
ఏడెకరాలస్థలమున
నాడొక బిల్డింగు గట్టినా , రది మిగులన్
పాడయ్యెను , రేకులు పగి
లాడాడ , రిపేర్లు చేసి తంతట , కోరన్ -
ఎనిమిది పక్కా రూముల
కనుమతి యిప్పించి నారు , కట్టిరి భవనాల్ ,
ఘనముగ గంగాధర్ గా
రనయం మా స్కూలటన్న యభిమానముతో .
కలదు బిల్డింగు ముందు వెన్కలను గ్రౌండు
కంప మొలిచి పాడయ్యె వెన్కాల గ్రౌండు
బాగు చేయించి నామిట్టి పనికి గూడ
పరగ గంగాధరం గారు పాటు పడిరి .
పది పరీక్ష జరుపు పబ్లికు సెంటరు
కోరి విన్నవించ పోరు సలిపి
కాంక్ష దీర్చి నారు గంగాధరం గారు
పాఠశాల గూర్చి ప్రణతు లిడుదు .
ఘాటైన కఠిన వైఖరి
పాటించితి నాడు , స్కూలు బాగు పడుటకై ,
నాటికి నాముందున్నది
దీటుగ మన స్కూలు ప్రగతి దీపించుటలే .
ఆయెన్ అర్వది యెన్మిదేండ్లు పయిగా , హైస్కూలు బెట్టించియున్ ,
వ్రాయంగా మనసాయె కొన్నయిన , కాలాతీతమై పోవునే
మో , యీ మాత్ర చరిత్ర యైన గనరేమో నేటి విద్యార్థులన్
ధ్యేయంబారసి వ్రాసినాడ , నిది గుర్తించండి కుల్లూరులో .
---------------------
నెల్లూరు దాటి వచ్చిన
కుల్లూరే దిక్కు , చదువు కొనుటకు , చాలా
పల్లెలు , నెల్లూరు కడప
జిల్లా వాళ్ళిటకు వచ్చి చేరిరి చదువన్ .
వరద రాజులు నాయుడు వంటి వారు
చేరి హెడ్మాష్టరుగ పని చేసి రిచట ,
కోరి గంగాధరం లాంటి గొప్పవారు
చేరి చదివిరి ఘనులైరి తేరి చూడ .
ఎందరో ఘను లీ స్కూలు నందు జదివి
యున్నతిని బొంది రేనున్ను నుద్యమించి
కోరుకొని వచ్చి యభివృధ్ధి గూర్చి నాడ
కూడి గంగాధరం గారు తోడు నిలువ .
ఏడెకరాలస్థలమున
నాడొక బిల్డింగు గట్టినా , రది మిగులన్
పాడయ్యెను , రేకులు పగి
లాడాడ , రిపేర్లు చేసి తంతట , కోరన్ -
ఎనిమిది పక్కా రూముల
కనుమతి యిప్పించి నారు , కట్టిరి భవనాల్ ,
ఘనముగ గంగాధర్ గా
రనయం మా స్కూలటన్న యభిమానముతో .
కలదు బిల్డింగు ముందు వెన్కలను గ్రౌండు
కంప మొలిచి పాడయ్యె వెన్కాల గ్రౌండు
బాగు చేయించి నామిట్టి పనికి గూడ
పరగ గంగాధరం గారు పాటు పడిరి .
పది పరీక్ష జరుపు పబ్లికు సెంటరు
కోరి విన్నవించ పోరు సలిపి
కాంక్ష దీర్చి నారు గంగాధరం గారు
పాఠశాల గూర్చి ప్రణతు లిడుదు .
ఘాటైన కఠిన వైఖరి
పాటించితి నాడు , స్కూలు బాగు పడుటకై ,
నాటికి నాముందున్నది
దీటుగ మన స్కూలు ప్రగతి దీపించుటలే .
ఆయెన్ అర్వది యెన్మిదేండ్లు పయిగా , హైస్కూలు బెట్టించియున్ ,
వ్రాయంగా మనసాయె కొన్నయిన , కాలాతీతమై పోవునే
మో , యీ మాత్ర చరిత్ర యైన గనరేమో నేటి విద్యార్థులన్
ధ్యేయంబారసి వ్రాసినాడ , నిది గుర్తించండి కుల్లూరులో .
11, ఏప్రిల్ 2017, మంగళవారం
మా కుల్లూరు -- 10
మా కుల్లూరు -- 10
----------------------
చీర్ల శింగరయ్య శెట్టి డొనేషను
కట్టె , నతని పేర ఘనము గాగ
అప్పు డెపుడొ యిచట హైస్కూలు పెట్టిరి
చదువు లన్న నెంత చవులు ప్రజకు !
నెల్లూరికి దూరములో
కుల్లూరున స్కూలు బెట్టి కూడా యరువై
యేళ్లకు పైగా గడచెను
యెల్లర కిది చదువు జెప్పె నీ ప్రాంతములో .
నలభయ్యేడు స్వతంత్రము ,
నలభై తొమ్మిదిన స్కూలు నడిపించిరి పె
ద్దలు మా కుల్లూరున తా
వెలుగులు విరజిమ్ము చుండె విద్య గరపుచున్ .
తల్లీ ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ , నీవు నా
యుల్లంబందున నిల్చి , జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము , నీదు వాక్కునను సంప్రీతిన్ , జగన్మాతరో !
కుల్లూరున్నత పాఠశాల యన నీకుంగీర్తి చేకొందుమే .
నా డీ ప్రార్థన పద్యము
పాడితి మట , ప్రతి దినమ్ము పరవశమున , నా
పోడుములకు గురువులు పో
రాడిరి , కామయ్య గారు వ్రాసిరి దీనిన్ .
ఏ పాఠశాల నా కెంతయు విఙ్ఞాన
మిచ్చి గురు స్థాన మెక్క జేసె
ఏ పాఠశాల నా యెదుగు దలకు నిల్చి
బుధ్ధులు గరపె ప్రాపులు వహించి
ఏ పాఠశాల నాకింత బ్రతుకు దెరు
వొసగె నిచ్చెన యయి స్ఫూర్తి నిచ్చి
ఏ పాఠశాల తా నీప్రాంత ప్రజలకు
విద్యా ప్రదాతయై వినుతి కెక్కె
నట్టి హైస్కూలు ' హెచ్ యం ' గ నరిగి , నాటి
గొప్ప దనములు సాధించు కొఱకు పూని ,
పూర్తి సాఫల్య ఫలములు పొంది నాను
తల్లి సేవతో జన్మమ్ము ధన్య మయ్యె .
----------------------
చీర్ల శింగరయ్య శెట్టి డొనేషను
కట్టె , నతని పేర ఘనము గాగ
అప్పు డెపుడొ యిచట హైస్కూలు పెట్టిరి
చదువు లన్న నెంత చవులు ప్రజకు !
నెల్లూరికి దూరములో
కుల్లూరున స్కూలు బెట్టి కూడా యరువై
యేళ్లకు పైగా గడచెను
యెల్లర కిది చదువు జెప్పె నీ ప్రాంతములో .
నలభయ్యేడు స్వతంత్రము ,
నలభై తొమ్మిదిన స్కూలు నడిపించిరి పె
ద్దలు మా కుల్లూరున తా
వెలుగులు విరజిమ్ము చుండె విద్య గరపుచున్ .
తల్లీ ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ , నీవు నా
యుల్లంబందున నిల్చి , జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము , నీదు వాక్కునను సంప్రీతిన్ , జగన్మాతరో !
కుల్లూరున్నత పాఠశాల యన నీకుంగీర్తి చేకొందుమే .
నా డీ ప్రార్థన పద్యము
పాడితి మట , ప్రతి దినమ్ము పరవశమున , నా
పోడుములకు గురువులు పో
రాడిరి , కామయ్య గారు వ్రాసిరి దీనిన్ .
ఏ పాఠశాల నా కెంతయు విఙ్ఞాన
మిచ్చి గురు స్థాన మెక్క జేసె
ఏ పాఠశాల నా యెదుగు దలకు నిల్చి
బుధ్ధులు గరపె ప్రాపులు వహించి
ఏ పాఠశాల నాకింత బ్రతుకు దెరు
వొసగె నిచ్చెన యయి స్ఫూర్తి నిచ్చి
ఏ పాఠశాల తా నీప్రాంత ప్రజలకు
విద్యా ప్రదాతయై వినుతి కెక్కె
నట్టి హైస్కూలు ' హెచ్ యం ' గ నరిగి , నాటి
గొప్ప దనములు సాధించు కొఱకు పూని ,
పూర్తి సాఫల్య ఫలములు పొంది నాను
తల్లి సేవతో జన్మమ్ము ధన్య మయ్యె .
10, ఏప్రిల్ 2017, సోమవారం
మా కుల్లూరు -- 9
మా కుల్లూరు -- 9
----------------
పేలి తిప్ప దిగువ వీరాంజ నేయులు
విగ్రహమ్ము బండ వెలసి యుండ
పరగ నాకు దెలిసి బహుకాల మందుండి
దేవళమ్ము వెలుగు దివ్య మగుచు .
నాదు చిన్న తనము నందొక యఙ్ఞమ్ము
జరిగె నిచట దైవ సన్నిధి కడ
మహిత హితము గలుగె మహనీయు లెందరో
వచ్చి వైభవమ్ము వచ్చె గుడికి .
కుల్లూరున్నత పాఠశాలకు తగన్ గూర్చంగ పూర్వోన్నతుల్
వెళ్లే వాడిని ఆంజనేయుడిని సేవించన్ పదోక్లాసు మా
పిల్లల్నెల్లర గొంచు పూజలకు పబ్లిక్ వ్రాయు మున్ముందు తా
నెల్లన్ జల్లగ జూచి పిల్లలను దీవించంగ నెంతేనియున్ .
----------------
పేలి తిప్ప దిగువ వీరాంజ నేయులు
విగ్రహమ్ము బండ వెలసి యుండ
పరగ నాకు దెలిసి బహుకాల మందుండి
దేవళమ్ము వెలుగు దివ్య మగుచు .
నాదు చిన్న తనము నందొక యఙ్ఞమ్ము
జరిగె నిచట దైవ సన్నిధి కడ
మహిత హితము గలుగె మహనీయు లెందరో
వచ్చి వైభవమ్ము వచ్చె గుడికి .
కుల్లూరున్నత పాఠశాలకు తగన్ గూర్చంగ పూర్వోన్నతుల్
వెళ్లే వాడిని ఆంజనేయుడిని సేవించన్ పదోక్లాసు మా
పిల్లల్నెల్లర గొంచు పూజలకు పబ్లిక్ వ్రాయు మున్ముందు తా
నెల్లన్ జల్లగ జూచి పిల్లలను దీవించంగ నెంతేనియున్ .
9, ఏప్రిల్ 2017, ఆదివారం
వెంకయ్య స్వామి శతకం --12
ఉప సంహారము
-----------------------
దివ్య మంగళ కళల్ దీపించు శిరముపై
పట్టు భిగియ తలపాగ జుట్టి
ధోవతి భిగియించి దోపి కట్టిన పంచె
అర్థ ముతక చొక్క యమర దొడిగి
తగ నిరాడంబరత తనర నిసుమంత
స్వార్థ పరత లేని స్వచ్చతముడు
కొంద రనుచరులు కూడి వర్తించంగ
నిటుల మాయింటి వాకిటికి వచ్చె
వచ్చి కూర్చుండె కుర్చీలొ వరదు , డపుడు
రమ్ము పోద మనుచు బిల్చె , సమ్మతించి
వెడలితిని నేను స్వామితో వీడు వెడలి ,
కల తొలంగెను , మెలకువ కలిగె నంత . -- 101
మండే కీలల మధ్యన
గుండములో నుండి ' ఇంకు ' గుడ్డల తోడన్
నిండుగ నా స్వప్నములో
దండిగ నొకనాడు స్వామి దర్శన మిచ్చెన్ . --102
రయముగ ఓంనారాయణ
నయమార భజించి ఆదినారాయణుడా !
జయమిమ్మని ప్రార్థించితి -- 103
దయామయుడు స్వామి మదికి దాపున నిల్చెన్ .
అరిషడ్వర్గము లంటని
పరిపూర్ణుడు స్వచ్చతముడు పరమాత్మ కళా
భరితుడు మహితాత్ముడు నుత -- 104
చరితుడు వెంకయ్యస్వామి చరణము గొలుతున్ .
నీవే మాజీవితములు
నావయి నడిపింతు వనుచు నమ్మితి మయ్యా !
సేవింతు మనుదినమ్మును
భావింతుము మనసు నిండ భగవానునిగా . -105
ఇడుమ లెన్నొ బడితి నికనైన విశ్రాంతి
గలుగ బరువు మోయ వలయు నీవు
బరువు నీవు మోసి పరమాత్మ ! యికనైన
కావు మయ్య నన్ను కమల నయన ! -- 106
ఫలశ్రుతి
-----------
స్వామి ! నీకటాక్ష ప్రభ లెంత దవ్వేగు
నంత వట్టు జనుల కండ యగుత !
చిరము నిన్ను దలచి శ్రీరస్తులై జను
లిహము పరము గాంతు రెలమి స్వామి ! -- 107
వెంకయ్య స్వామి శతకము
సంకట హరణమ్ము , దీని జదివిన విన్నన్
వెంకట రమణుని సాక్షిగ
సంకటములు బాయు , సుఖము శాంతియు గల్గున్ . -- 108
-- స్వస్తి --
-----------------------
దివ్య మంగళ కళల్ దీపించు శిరముపై
పట్టు భిగియ తలపాగ జుట్టి
ధోవతి భిగియించి దోపి కట్టిన పంచె
అర్థ ముతక చొక్క యమర దొడిగి
తగ నిరాడంబరత తనర నిసుమంత
స్వార్థ పరత లేని స్వచ్చతముడు
కొంద రనుచరులు కూడి వర్తించంగ
నిటుల మాయింటి వాకిటికి వచ్చె
వచ్చి కూర్చుండె కుర్చీలొ వరదు , డపుడు
రమ్ము పోద మనుచు బిల్చె , సమ్మతించి
వెడలితిని నేను స్వామితో వీడు వెడలి ,
కల తొలంగెను , మెలకువ కలిగె నంత . -- 101
మండే కీలల మధ్యన
గుండములో నుండి ' ఇంకు ' గుడ్డల తోడన్
నిండుగ నా స్వప్నములో
దండిగ నొకనాడు స్వామి దర్శన మిచ్చెన్ . --102
రయముగ ఓంనారాయణ
నయమార భజించి ఆదినారాయణుడా !
జయమిమ్మని ప్రార్థించితి -- 103
దయామయుడు స్వామి మదికి దాపున నిల్చెన్ .
అరిషడ్వర్గము లంటని
పరిపూర్ణుడు స్వచ్చతముడు పరమాత్మ కళా
భరితుడు మహితాత్ముడు నుత -- 104
చరితుడు వెంకయ్యస్వామి చరణము గొలుతున్ .
నీవే మాజీవితములు
నావయి నడిపింతు వనుచు నమ్మితి మయ్యా !
సేవింతు మనుదినమ్మును
భావింతుము మనసు నిండ భగవానునిగా . -105
ఇడుమ లెన్నొ బడితి నికనైన విశ్రాంతి
గలుగ బరువు మోయ వలయు నీవు
బరువు నీవు మోసి పరమాత్మ ! యికనైన
కావు మయ్య నన్ను కమల నయన ! -- 106
ఫలశ్రుతి
-----------
స్వామి ! నీకటాక్ష ప్రభ లెంత దవ్వేగు
నంత వట్టు జనుల కండ యగుత !
చిరము నిన్ను దలచి శ్రీరస్తులై జను
లిహము పరము గాంతు రెలమి స్వామి ! -- 107
వెంకయ్య స్వామి శతకము
సంకట హరణమ్ము , దీని జదివిన విన్నన్
వెంకట రమణుని సాక్షిగ
సంకటములు బాయు , సుఖము శాంతియు గల్గున్ . -- 108
-- స్వస్తి --
8, ఏప్రిల్ 2017, శనివారం
వెంకయ్య స్వామి శతకం -- 11
పసుల , జనుల రోగ బాధలు దొలగంగ
జేసి గ్రామ చీటి వ్రాసి నావు
పల్లె పల్లె దిరిగి పలుమార్లు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 91
నేడు పల్లె పల్లె నీదు గుడులు గట్టి
నిన్ను నిలిపి కొలిచి సన్నుతించి
భక్తు లైరి నీకు పరమాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 92
అరయ నేటి కేటి కారాధనోత్సవ
ప్రభలు పెరిగె , జనుల భక్తి పెరిగె
మ్రొక్కు కొనుట పెరిగె , ముదమయ్యె , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 93
నేడు పల్లె లందు నియతిగా గుడి కేగు
టన్న నీదు గుడికె నెమ్మనమున
నిలిచి కోర్కె దీర కొలుతురు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 94
ఒక్క ప్రొద్దు లుందు రొనరంగ శనివార
మందు నిన్ను దలచి మహిత చరిత !
భక్త జనులు గలరు ప్రతి యింట , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 95
కలలు పండు గాక కళ్యాణ మౌగాక
బిడ్డ గలుగు గాక ప్రియము మీర
వచ్చి నిన్ను గొలువ వరమగు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 96
కోరి వత్తు రేని ఆరాధ నోత్సవ
మందు గొలగ మూడి మహిమ దెలిసి
పనులు చక్క బడును , పరమాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 97
క్షేత్ర దర్శనమ్ము , శ్రీ స్వామి దర్శన
భాగ్య , మట భుజించు భాగ్య మొంద
నార్తి తొలగి పోవు , నభయమ్ము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 98
నీదు మాల వేసి నియమాలు పాటించి
గొలగ మూడి వచ్చి కొలని లోన
మ్రొక్కు దీర్చు కొనగ మోక్షమే , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 99
పాత్రత గలదేని క్షేత్ర దర్శన మగు
ఇహ పరముల శుభము లిందు నందు
బడయ వచ్చు జనులు , పరమాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 100
జేసి గ్రామ చీటి వ్రాసి నావు
పల్లె పల్లె దిరిగి పలుమార్లు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 91
నేడు పల్లె పల్లె నీదు గుడులు గట్టి
నిన్ను నిలిపి కొలిచి సన్నుతించి
భక్తు లైరి నీకు పరమాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 92
అరయ నేటి కేటి కారాధనోత్సవ
ప్రభలు పెరిగె , జనుల భక్తి పెరిగె
మ్రొక్కు కొనుట పెరిగె , ముదమయ్యె , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 93
నేడు పల్లె లందు నియతిగా గుడి కేగు
టన్న నీదు గుడికె నెమ్మనమున
నిలిచి కోర్కె దీర కొలుతురు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 94
ఒక్క ప్రొద్దు లుందు రొనరంగ శనివార
మందు నిన్ను దలచి మహిత చరిత !
భక్త జనులు గలరు ప్రతి యింట , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 95
కలలు పండు గాక కళ్యాణ మౌగాక
బిడ్డ గలుగు గాక ప్రియము మీర
వచ్చి నిన్ను గొలువ వరమగు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 96
కోరి వత్తు రేని ఆరాధ నోత్సవ
మందు గొలగ మూడి మహిమ దెలిసి
పనులు చక్క బడును , పరమాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 97
క్షేత్ర దర్శనమ్ము , శ్రీ స్వామి దర్శన
భాగ్య , మట భుజించు భాగ్య మొంద
నార్తి తొలగి పోవు , నభయమ్ము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 98
నీదు మాల వేసి నియమాలు పాటించి
గొలగ మూడి వచ్చి కొలని లోన
మ్రొక్కు దీర్చు కొనగ మోక్షమే , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 99
పాత్రత గలదేని క్షేత్ర దర్శన మగు
ఇహ పరముల శుభము లిందు నందు
బడయ వచ్చు జనులు , పరమాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 100
7, ఏప్రిల్ 2017, శుక్రవారం
వెంకయ్య స్వామి శతకం -- 10
వెంకయ్య స్వామి శతకం -- 10
------------------------------------
కావిడి గొనిపోయి ఘనుడు నారాయణ
నాలు గిల్ల భోజ నాలు దేగ
యేమి తినిరొ యేమొ యెరుగము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 81
చేపల వల బూని చేరువ నొక్కండు
పూల సజ్జ బట్టి పూజ కొకడు
యెవరి తీరు గొప్ప యెరుగమా , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 82
మనిషి చూపు గరిమ మార దరువది నాల్గు
అందు నొకటి మార నంధు డగును
దీని భావ మేమొ దెలియము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 83
బలిమి లక్ష లారు కలియుగ దేవుళ్ళ
చూపు లంటి వయ్య శోధన యొన
రించ మేము చాల లేమయ్య , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 84
మూడు కాలములను చూడ జాలిన గొప్ప
ఆత్మ శక్తి గలుగ , నక్షరాల
నీవు నుడువు మాట నిజమౌను , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 85
పరగ చుట్ట జుట్టి పైపంచ విసరుచు
జబ్బు పడ్డ వాళ్ళ జబ్బులెల్ల
తొలుగి యడగి పోవ ద్రోచితి , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 86
తనది యొకటె ధ్యాస తంబూర మీటుచు
ధ్యాన యోగ మందు దగిలి యుంట
ధ్యాస లౌకి కమున దగులదు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 87
వ్రేలి ముద్ర లొనర వేయుచు నుందువు
ధ్యాన మందు లేని తరుణ మందు
నాడు వాటి విలువ నరయము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 88
ముద్ర లేసి నీవు ముదమార నిచ్చిన
కాగి తాలు నాడు ఘనము గాగ
దేవుని గదు లందు దీపించె , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 89
నీదు చేయి తాకి నిమిరిన దారాలు
మంత్ర పూత మైన మహిమ దాల్చి
మాకు రక్ష యిచ్చె , మహితాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 90
------------------------------------
కావిడి గొనిపోయి ఘనుడు నారాయణ
నాలు గిల్ల భోజ నాలు దేగ
యేమి తినిరొ యేమొ యెరుగము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 81
చేపల వల బూని చేరువ నొక్కండు
పూల సజ్జ బట్టి పూజ కొకడు
యెవరి తీరు గొప్ప యెరుగమా , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 82
మనిషి చూపు గరిమ మార దరువది నాల్గు
అందు నొకటి మార నంధు డగును
దీని భావ మేమొ దెలియము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 83
బలిమి లక్ష లారు కలియుగ దేవుళ్ళ
చూపు లంటి వయ్య శోధన యొన
రించ మేము చాల లేమయ్య , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 84
మూడు కాలములను చూడ జాలిన గొప్ప
ఆత్మ శక్తి గలుగ , నక్షరాల
నీవు నుడువు మాట నిజమౌను , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 85
పరగ చుట్ట జుట్టి పైపంచ విసరుచు
జబ్బు పడ్డ వాళ్ళ జబ్బులెల్ల
తొలుగి యడగి పోవ ద్రోచితి , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 86
తనది యొకటె ధ్యాస తంబూర మీటుచు
ధ్యాన యోగ మందు దగిలి యుంట
ధ్యాస లౌకి కమున దగులదు , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 87
వ్రేలి ముద్ర లొనర వేయుచు నుందువు
ధ్యాన మందు లేని తరుణ మందు
నాడు వాటి విలువ నరయము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 88
ముద్ర లేసి నీవు ముదమార నిచ్చిన
కాగి తాలు నాడు ఘనము గాగ
దేవుని గదు లందు దీపించె , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 89
నీదు చేయి తాకి నిమిరిన దారాలు
మంత్ర పూత మైన మహిమ దాల్చి
మాకు రక్ష యిచ్చె , మహితాత్మ ! వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 90
6, ఏప్రిల్ 2017, గురువారం
వెంకయ్య స్వామి శతకం -- 9
వెంకయ్య స్వామి శతకం -- 9
-----------------------------------
సత్య ధర్మ రతులు సద్గురు సేవల
నియతి బ్రతుకు వారు నిర్మలులును
నిన్ను నమ్ము జనులు , నిజమిది , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . --71
రాజు కెంత యున్న రాజుకే యగు గాని
మనము జేసు కున్న మటుకె మనకు
ఆశ పడకు డంటి వయ్య , శ్రీవెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 72
జీవు లన్ని టందు చేరి నేనుందును
తెలిసి కొనుడు జనులు దీని ననుచు
ప్రాణి హింస చేయ వలదంటి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . --73
అంతరాలు మాని అంద రొక్కటి కాగ
మెలుగు డంచు మమ్ము మలచి నావు
కులము లెన్ని యున్న కొలిచిరి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 74
పరగ గొలగమూడి పదిహేను వందల
స్థలము దైవ భూమి తర తరాలు
వెలుగు వెలుగు నంటి , వేర్పడె , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 75
ఆత్మ పరిమళించి అత్యంత సౌందర్య
రూపు దాల్చి శక్తి ప్రాపు బొంది
జనుల కొఱకు నిల్చె జగమున , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 76
కోరుకున్న జనుల కొంగు బంగారమై
కోరి వెలసి నావు గొలగమూడి
క్షేత్ర మందు మాకు సిరిమాను , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 77
ఉండు టెల్ల నాడు మొండి గోడల మధ్య
తాటి యాకు పరచి , దాని మీద
యెంత మక్కువయ్య , యెరుగమా , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 78
నాగు లొక్క ప్రక్క సాగి కాటేసినా
చిద్వి లాస హాస సిరు లొలుకుచు
యోగ సాధనమున నుంటివి , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 79
అర్థ ముతక చొక్క యట్టిదే పంచయు
తడిపి యార బెట్ట తప్ప దనగ
ఏమి గట్టి నారొ యెరుగము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 80
-----------------------------------
సత్య ధర్మ రతులు సద్గురు సేవల
నియతి బ్రతుకు వారు నిర్మలులును
నిన్ను నమ్ము జనులు , నిజమిది , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . --71
రాజు కెంత యున్న రాజుకే యగు గాని
మనము జేసు కున్న మటుకె మనకు
ఆశ పడకు డంటి వయ్య , శ్రీవెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 72
జీవు లన్ని టందు చేరి నేనుందును
తెలిసి కొనుడు జనులు దీని ననుచు
ప్రాణి హింస చేయ వలదంటి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . --73
అంతరాలు మాని అంద రొక్కటి కాగ
మెలుగు డంచు మమ్ము మలచి నావు
కులము లెన్ని యున్న కొలిచిరి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 74
పరగ గొలగమూడి పదిహేను వందల
స్థలము దైవ భూమి తర తరాలు
వెలుగు వెలుగు నంటి , వేర్పడె , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 75
ఆత్మ పరిమళించి అత్యంత సౌందర్య
రూపు దాల్చి శక్తి ప్రాపు బొంది
జనుల కొఱకు నిల్చె జగమున , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 76
కోరుకున్న జనుల కొంగు బంగారమై
కోరి వెలసి నావు గొలగమూడి
క్షేత్ర మందు మాకు సిరిమాను , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 77
ఉండు టెల్ల నాడు మొండి గోడల మధ్య
తాటి యాకు పరచి , దాని మీద
యెంత మక్కువయ్య , యెరుగమా , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 78
నాగు లొక్క ప్రక్క సాగి కాటేసినా
చిద్వి లాస హాస సిరు లొలుకుచు
యోగ సాధనమున నుంటివి , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 79
అర్థ ముతక చొక్క యట్టిదే పంచయు
తడిపి యార బెట్ట తప్ప దనగ
ఏమి గట్టి నారొ యెరుగము , వెంకయ్య
స్వామి! శరణు నీదు చరణములకు. -- 80
5, ఏప్రిల్ 2017, బుధవారం
రాముడే రాజుగా ... రక్షగా .....(గేయం)
రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా
ఒక్కటే మాటగా ఒక్కటే శరముగా
ఒక్క సీతయె సతిగ యుగపురుషుడై నిలిచె /రాముడే/
దండ్రి కిచ్చిన మాట తలదాల్చి కడదాక
పడరాని యిడుముల పడియునూ విడువని /రాముడే/
అన్నగా తమ్ములకు ఆదర్శమూర్తిగా
మన్ననలు పొంది యీ మనుజులందరకు /రాముడే/
రావణుని చావుతో రామబాణము శక్తి
రామనామము శక్తి రాజిల్లె లోకాన /రాముడే/
తొలుత శ్రీరామయని పలుకులో రాతలో
పలుకక రాయక వెలయింప రేదియు /రాముడే/
పల్లెలా పట్నాల ప్రతి మందిరాలలో
కడగి సీతారామ కళ్యాణములు సేయ/రాముడే/
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా
ఒక్కటే మాటగా ఒక్కటే శరముగా
ఒక్క సీతయె సతిగ యుగపురుషుడై నిలిచె /రాముడే/
దండ్రి కిచ్చిన మాట తలదాల్చి కడదాక
పడరాని యిడుముల పడియునూ విడువని /రాముడే/
అన్నగా తమ్ములకు ఆదర్శమూర్తిగా
మన్ననలు పొంది యీ మనుజులందరకు /రాముడే/
రావణుని చావుతో రామబాణము శక్తి
రామనామము శక్తి రాజిల్లె లోకాన /రాముడే/
తొలుత శ్రీరామయని పలుకులో రాతలో
పలుకక రాయక వెలయింప రేదియు /రాముడే/
పల్లెలా పట్నాల ప్రతి మందిరాలలో
కడగి సీతారామ కళ్యాణములు సేయ/రాముడే/
వెంకయ్య స్వామి శతకం -- 8
మలిన మంట నట్టి మహనీయు లెవరైన
గలర ఘను లటన్న నిలను సాయి ,
నీవు దప్ప లేరు , నిజమిది , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 61
దాయ లార్గురు తమ దరి జేరగా లేరు
గనుకనె పరమాత్మ కళలు మిమ్ము
జేరెను మహితాత్మ చిరముగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 62
స్వచ్చ తములు మీరు స్థావర జంగముల్
మీ యనుఙ్ఞ మేర మీర లేవు
మీకు సాధ్య పడని మేరలా ? వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 63
శ్రీ శరీర సహిత శివ మూర్తులై యుండ
చేరి కొలిచి నట్టి తీరు కంటె
జన సముద్ర మిపుడు ఘనమయ్యె , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 64
నాడు మీరు జూపి నట్టి యద్భుతముల
కంటె నేడు జనులు కనుల ముందె
కోరి తీర్చు కొనుట కొల్లలు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 65
సకల కర్మ లందు సంసారి ధర్మమ్ము
తప్పకున్న గొప్ప , తగ నదేమి
గొప్ప గాదు రుషికి , చెప్పితి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 66
దారి తప్ప కుండ దారాన్ని తెగకుండ
చూచు కొనుడు నేను కాచు కుందు
మిమ్ము విడువ నంటి , మేలయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 67
లాభ మందె మనసు లయబెట్టి చూడొద్దు
పాప మందు కూడ భాగ మొదవు
టరసి చూడు మంటి వయ్యరో ! వెంకయ్య
స్వామి శరణు నీదు చరణములకు . -- 68
పొసగ వేరొకరిని పొమ్మను కంటెను
మనమె తప్పు కొనుట మంచి దనుచు
మంచి జెప్పి నావు , మహితాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 69
గొఱ్ఱె లుండు వేలు గుంపులో మనగొఱ్ఱె
కాలు పట్టి తెచ్చు ఘనత కలదు ,
రండు రక్ష నిత్తు , రమ్మంటి వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 70
గలర ఘను లటన్న నిలను సాయి ,
నీవు దప్ప లేరు , నిజమిది , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 61
దాయ లార్గురు తమ దరి జేరగా లేరు
గనుకనె పరమాత్మ కళలు మిమ్ము
జేరెను మహితాత్మ చిరముగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 62
స్వచ్చ తములు మీరు స్థావర జంగముల్
మీ యనుఙ్ఞ మేర మీర లేవు
మీకు సాధ్య పడని మేరలా ? వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 63
శ్రీ శరీర సహిత శివ మూర్తులై యుండ
చేరి కొలిచి నట్టి తీరు కంటె
జన సముద్ర మిపుడు ఘనమయ్యె , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 64
నాడు మీరు జూపి నట్టి యద్భుతముల
కంటె నేడు జనులు కనుల ముందె
కోరి తీర్చు కొనుట కొల్లలు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 65
సకల కర్మ లందు సంసారి ధర్మమ్ము
తప్పకున్న గొప్ప , తగ నదేమి
గొప్ప గాదు రుషికి , చెప్పితి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 66
దారి తప్ప కుండ దారాన్ని తెగకుండ
చూచు కొనుడు నేను కాచు కుందు
మిమ్ము విడువ నంటి , మేలయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 67
లాభ మందె మనసు లయబెట్టి చూడొద్దు
పాప మందు కూడ భాగ మొదవు
టరసి చూడు మంటి వయ్యరో ! వెంకయ్య
స్వామి శరణు నీదు చరణములకు . -- 68
పొసగ వేరొకరిని పొమ్మను కంటెను
మనమె తప్పు కొనుట మంచి దనుచు
మంచి జెప్పి నావు , మహితాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 69
గొఱ్ఱె లుండు వేలు గుంపులో మనగొఱ్ఱె
కాలు పట్టి తెచ్చు ఘనత కలదు ,
రండు రక్ష నిత్తు , రమ్మంటి వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 70
4, ఏప్రిల్ 2017, మంగళవారం
వెంకయ్య స్వామి శతకం -- 7
పదవ చూపు నాది పరికింప తగులుకో
పోవు చూపిదంచు పుణ్యమూర్తి !
నుడివి తీవు శక్తి గడియించి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 51
ఆకలి గొని వచ్చి యడిగిన వారికి
పట్టె డన్న మిచ్చి పంపు డనుట
నిన్ను గుర్తు దెచ్చు నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 52
గౌరవించి పిలువు మేరి నైనను , ఒరే
యనకు పాప మంటి వయ్య దేవ !
నీదు తత్త్వ మిదియె , నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 53
పాడు బుధ్ధి జూపి పావలా కాజేయ
పది వరాలు నీవి వదులు నంటి
వక్షరాల నిజము , రక్షకా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 54
మనిషి యందె దాగి మన తప్పు లొప్పులు
లెక్క జూచు చుందు రెలమి సాక్షు
లనుచు నెరుక పరచి తయ్య శ్రీ వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 55
కార్య ఫలము దెలియగా వచ్చు వారికి
వ్రాసి ముందె ఫలము వేసి ముద్ర
ముట్ట జెప్పినావు ముదమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 56
మోకు తుంట లొకట ముంతొక్క చేతిలో
యేటి పాయ మీది కేగి సాగి
మంట జేయు చుండు మహనీయ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 57
అర్బుదాలు కోటు లన రామ రత్నాలు
మణులన జలయఙ్ఞ మహిత తపము
పంచితి వరుమాన ఫలములు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 58
అరయ నెవరి నైన అయ్యా యనుటయే
యిష్ట మంటి వయ్య , హితుడు వీవు
మానవాళి కంత , మహితాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 59
మనుజ కర్మ బాప మహి లోన జన్మించి
తపము జేసి తయ్య దైవ మూర్తి !
కొల్వ నిన్ను కర్మ కూలును , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 60
పోవు చూపిదంచు పుణ్యమూర్తి !
నుడివి తీవు శక్తి గడియించి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 51
ఆకలి గొని వచ్చి యడిగిన వారికి
పట్టె డన్న మిచ్చి పంపు డనుట
నిన్ను గుర్తు దెచ్చు నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 52
గౌరవించి పిలువు మేరి నైనను , ఒరే
యనకు పాప మంటి వయ్య దేవ !
నీదు తత్త్వ మిదియె , నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 53
పాడు బుధ్ధి జూపి పావలా కాజేయ
పది వరాలు నీవి వదులు నంటి
వక్షరాల నిజము , రక్షకా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 54
మనిషి యందె దాగి మన తప్పు లొప్పులు
లెక్క జూచు చుందు రెలమి సాక్షు
లనుచు నెరుక పరచి తయ్య శ్రీ వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 55
కార్య ఫలము దెలియగా వచ్చు వారికి
వ్రాసి ముందె ఫలము వేసి ముద్ర
ముట్ట జెప్పినావు ముదమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 56
మోకు తుంట లొకట ముంతొక్క చేతిలో
యేటి పాయ మీది కేగి సాగి
మంట జేయు చుండు మహనీయ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 57
అర్బుదాలు కోటు లన రామ రత్నాలు
మణులన జలయఙ్ఞ మహిత తపము
పంచితి వరుమాన ఫలములు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 58
అరయ నెవరి నైన అయ్యా యనుటయే
యిష్ట మంటి వయ్య , హితుడు వీవు
మానవాళి కంత , మహితాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 59
మనుజ కర్మ బాప మహి లోన జన్మించి
తపము జేసి తయ్య దైవ మూర్తి !
కొల్వ నిన్ను కర్మ కూలును , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 60
3, ఏప్రిల్ 2017, సోమవారం
వెంకయ్య స్వామి శతకం -- 6
నీదు పాద ధూళి నిండిన నేలలు
పావనాలు పుణ్య పథము లయ్య ,
వర సుభిక్ష మగుచు వర్థిల్లు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 41
పొసగ గొలగమూడి పుణ్యాల పంటయై
దేవ భూమి యయ్యె దివ్య మూర్తి !
నీవు వెలయ బట్టి , నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 42
కూడి తిరుగ నీవు కుల్లూరు , రాజుపా
ళ్యమ్ము జనులు వృద్ధి యైరి , దేశ
దేశ ములను పేరు దెచ్చిరి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 43
పెన్న బద్దె వోలు పేరు ప్రఖ్యాతులు
పెనసె నయ్య నీదు పేరు తోడ
దాని నిన్ను గలిపి తలుతురు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 44
వరలును కలువాయి , బ్రాహ్మణ పల్లెయు
నరయ నీవు తిరిగి నంత వట్టు
దినము దినము నెంత ఘనమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 45
నిన్ను నమ్ము వారు నీమాట విను వారు
బాగు పడిరి మిగుల పరమ పురుష !
వినక చెడిన వారు వెర్రులు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 46
నీ సమాధి చేరి నీకు నివేదించి
చేయు పనికి నీవు సాయ మొనర
జేతు వనఘ ! నతులు జేతుము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 47
తలచి నిన్నడుగగ కలలోన పొడసూపి
అవును గాదను సన్న లరయ జేసి
సూచన లిడు టెంత శోభయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 48
బాల్య మందు నిన్ను పరి పరి దర్శించి
దీవెనలను బడసి తేజమొప్ప
ఖ్యాతి గాంచి నాను , ఘనుడవు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 49
వచన మందు నీదు వర చరితము వ్రాసి
మ్రొక్కు దీర్చి నాను మక్కువముగ
ముక్తి నిమ్ము కష్ట ముల నుండి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 50
పావనాలు పుణ్య పథము లయ్య ,
వర సుభిక్ష మగుచు వర్థిల్లు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 41
పొసగ గొలగమూడి పుణ్యాల పంటయై
దేవ భూమి యయ్యె దివ్య మూర్తి !
నీవు వెలయ బట్టి , నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 42
కూడి తిరుగ నీవు కుల్లూరు , రాజుపా
ళ్యమ్ము జనులు వృద్ధి యైరి , దేశ
దేశ ములను పేరు దెచ్చిరి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 43
పెన్న బద్దె వోలు పేరు ప్రఖ్యాతులు
పెనసె నయ్య నీదు పేరు తోడ
దాని నిన్ను గలిపి తలుతురు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 44
వరలును కలువాయి , బ్రాహ్మణ పల్లెయు
నరయ నీవు తిరిగి నంత వట్టు
దినము దినము నెంత ఘనమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 45
నిన్ను నమ్ము వారు నీమాట విను వారు
బాగు పడిరి మిగుల పరమ పురుష !
వినక చెడిన వారు వెర్రులు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 46
నీ సమాధి చేరి నీకు నివేదించి
చేయు పనికి నీవు సాయ మొనర
జేతు వనఘ ! నతులు జేతుము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 47
తలచి నిన్నడుగగ కలలోన పొడసూపి
అవును గాదను సన్న లరయ జేసి
సూచన లిడు టెంత శోభయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 48
బాల్య మందు నిన్ను పరి పరి దర్శించి
దీవెనలను బడసి తేజమొప్ప
ఖ్యాతి గాంచి నాను , ఘనుడవు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 49
వచన మందు నీదు వర చరితము వ్రాసి
మ్రొక్కు దీర్చి నాను మక్కువముగ
ముక్తి నిమ్ము కష్ట ముల నుండి , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 50
2, ఏప్రిల్ 2017, ఆదివారం
వెంకయ్య స్వామి శతకం -- 5
కోరి శిష్యు డయ్యె నారాయణ స్వామి
నీదు తోడు దిరిగి నీడ యగుచు
ఘనత దాల్చె నీవు కరుణించ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 31
చనవు మీర నిన్ను చలమయ్య నాయుడు
కొలిచి నిలిచినాడు కూడి మాడి
అతడిదే యదృష్ట మన నొప్పు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 32
దయకు పాత్రు డయ్యె జయరామ రాజు తా
వచ్చి నీదు తోడ వాస మందు
వరము బొంది నాడు , వరదుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 33
రోజు కూలి యర్థ రూపాయి కొరగాని
కఱ్ఱి దేవుడయ్య ఘనత గాంచె
నీ కటాక్ష సిధ్ధి యే కదా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 34
పిలుపు వచ్చి రాగ వెంటనే పెద్దయ్య
చేరి నీతొ దిరుగు చేరువయ్యె
నింత పుణ్య ఫలము సొంతమై , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 35
వెలయ చివర దాక తులశమ్మ నిను గొల్చి
పుణ్య ఫలము బొందె , ఫూజనీయ
సుకృత ఫలిత మిదియె , సులభుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 36
నీకు సహచరించి నిన్గొల్చి తిరిగిరి
యెంద రెందరొ జను లంద రెంత
పూర్వ జన్మ లందు పుణ్యులో ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 37
తండ్రి పెంచలయ్య తల్లియై పిచ్చమ్మ
కన్న కడుపు లెన్ని పున్నెములకు
ప్రోవులైరొ కొలువ బోలునా ? వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 38
నతులు నిన్ను గన్న నాగులేటూరుకు
ధన్య యయ్యె తాను ధరణి తల్లి
తల్లి పేరు నిలిచె స్థాయిగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 39
నీవు పాద మిడిన నేలలు , నీళ్లును
కొండ లడవు లున్ను కోన లున్ను
పావన మయి యొప్పు , భగవాను వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 40
నీదు తోడు దిరిగి నీడ యగుచు
ఘనత దాల్చె నీవు కరుణించ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 31
చనవు మీర నిన్ను చలమయ్య నాయుడు
కొలిచి నిలిచినాడు కూడి మాడి
అతడిదే యదృష్ట మన నొప్పు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 32
దయకు పాత్రు డయ్యె జయరామ రాజు తా
వచ్చి నీదు తోడ వాస మందు
వరము బొంది నాడు , వరదుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 33
రోజు కూలి యర్థ రూపాయి కొరగాని
కఱ్ఱి దేవుడయ్య ఘనత గాంచె
నీ కటాక్ష సిధ్ధి యే కదా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 34
పిలుపు వచ్చి రాగ వెంటనే పెద్దయ్య
చేరి నీతొ దిరుగు చేరువయ్యె
నింత పుణ్య ఫలము సొంతమై , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 35
వెలయ చివర దాక తులశమ్మ నిను గొల్చి
పుణ్య ఫలము బొందె , ఫూజనీయ
సుకృత ఫలిత మిదియె , సులభుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 36
నీకు సహచరించి నిన్గొల్చి తిరిగిరి
యెంద రెందరొ జను లంద రెంత
పూర్వ జన్మ లందు పుణ్యులో ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 37
తండ్రి పెంచలయ్య తల్లియై పిచ్చమ్మ
కన్న కడుపు లెన్ని పున్నెములకు
ప్రోవులైరొ కొలువ బోలునా ? వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 38
నతులు నిన్ను గన్న నాగులేటూరుకు
ధన్య యయ్యె తాను ధరణి తల్లి
తల్లి పేరు నిలిచె స్థాయిగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 39
నీవు పాద మిడిన నేలలు , నీళ్లును
కొండ లడవు లున్ను కోన లున్ను
పావన మయి యొప్పు , భగవాను వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 40
1, ఏప్రిల్ 2017, శనివారం
వెంకయ్య స్వామి శతకం -- 4
కోటి తీర్థ శివుని కోవెల వెలుపల
నీవు పెంచి నట్టి నిడివి మఱ్ఱి
నీకు సాక్షి యగుచు నిలిచేను , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 21
తనర బావి లోకి తలక్రిందు వ్రేలాడ
కాళ్లు వేప కొమ్మ కాన్చి పెనచి
తపము జేసి తంట , ధన్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 22
ఆకు లోని యన్న మన్ని వైపుల నెట్టి
మధ్య లోది తిని , సమ సమముగ
భూతములకు బెట్టు పుణ్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 23
నీరు త్రాగు టేమి నీమమ్మొ , యేటిలో
మూతి ముంచి త్రాగు ముచ్చటేల !
తెలియ దింత దనుక , దేవుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 24
రాళ్ళు మాకు జూడ , రత్నాల రాశుల
తీరు బద్దె వోలు తిప్ప నీకు
తీరు చూడ చూపు తీక్ష్ణము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 25
యేటి చూపు కలదు నీటి పాయల యందు
కొండ చూపు కలదు కొండ లందు
అడవి చూపులు గల వడవుల , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 26
నడిమి నీట నాది నారాయ నుడివంట
జలధి మీద నడక సాగె నంట
అపర కళల భగవ దవతార ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 27
గొలగమూడి క్షేత్ర స్థలము మొత్తమ్మింక
రెండు వంద లేళ్ళు నిండి నాక
తిరుపతి యగు నంటి వరయగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 28
పడును క్షేత్ర మందు బంగారు గని యని
యంటి వయ్య , ఋజువు కంటి మిపుడె ,
పసిడి పండు చుండె పచ్చగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 29
నిండి జనుల తోడ నిత్య కళ్యాణమై
పచ్చ తోరణముల పండు వగుచు
గొలగమూడి నేడు వెలిగేను , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 30
నీవు పెంచి నట్టి నిడివి మఱ్ఱి
నీకు సాక్షి యగుచు నిలిచేను , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 21
తనర బావి లోకి తలక్రిందు వ్రేలాడ
కాళ్లు వేప కొమ్మ కాన్చి పెనచి
తపము జేసి తంట , ధన్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 22
ఆకు లోని యన్న మన్ని వైపుల నెట్టి
మధ్య లోది తిని , సమ సమముగ
భూతములకు బెట్టు పుణ్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 23
నీరు త్రాగు టేమి నీమమ్మొ , యేటిలో
మూతి ముంచి త్రాగు ముచ్చటేల !
తెలియ దింత దనుక , దేవుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 24
రాళ్ళు మాకు జూడ , రత్నాల రాశుల
తీరు బద్దె వోలు తిప్ప నీకు
తీరు చూడ చూపు తీక్ష్ణము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 25
యేటి చూపు కలదు నీటి పాయల యందు
కొండ చూపు కలదు కొండ లందు
అడవి చూపులు గల వడవుల , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 26
నడిమి నీట నాది నారాయ నుడివంట
జలధి మీద నడక సాగె నంట
అపర కళల భగవ దవతార ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 27
గొలగమూడి క్షేత్ర స్థలము మొత్తమ్మింక
రెండు వంద లేళ్ళు నిండి నాక
తిరుపతి యగు నంటి వరయగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 28
పడును క్షేత్ర మందు బంగారు గని యని
యంటి వయ్య , ఋజువు కంటి మిపుడె ,
పసిడి పండు చుండె పచ్చగా , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 29
నిండి జనుల తోడ నిత్య కళ్యాణమై
పచ్చ తోరణముల పండు వగుచు
గొలగమూడి నేడు వెలిగేను , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 30
31, మార్చి 2017, శుక్రవారం
వెంకయ్య స్వామి శతకం -- 3
చేరి గొలగమూడి సారించి నిలిచిన
హృదయ పద్మ మందు ముదము గలుగు
గొలగమూడి క్షేత్ర నిలయుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 11
గొలగమూడి చనుచు గొంతెత్తి పాడుచు
వచ్చు భక్త జనుల పాద ధూళి
తాకినా జనులకు ధన్యతే , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 12
జబ్బు చేసి నిన్ను శరణు వేడంగనే
బాగు జేసి వారి బాధ నంత
నీవు తీసుకొనుట నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 13
నీకు దగ్గరైన నిన్గొల్చు భక్తుల
స్వప్న మందు శేష శయను డగుచు
దర్శనమ్ము నిచ్చి దయజూచు వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 14
నేల లోపలైన , నింగిలో నైనను
నీరు , నిప్పు , గాలి నియతి లోను
చూపు బరుప గలవు శోధింప , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 15
తగులు కొనుచు పోవు దశమాన చూపులో
ప్రకృతి శక్తి నాపు ప్రతిభ గలదు ,
నీదు నాత్మ శక్తి నెరుగము , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 16
కురియు మన్న కురియు కోరిన , నాగుమం
చన్న నాగు వర్ష మద్భుత మిది ,
నిన్ను మీర గలద ? నేరదు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 17
తల్లి దండ్రి నీవు దైవమ్ము నీవంచు
నమ్మి బ్రతుకు వారి నరసి నీవు
నీడ యగుచు వెనుక నిలుతువు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 18
పొసగ గుండ మేసి పోగొట్టి నావంట
బాధ లెగయు నింటి బాధలెల్ల ,
బరువు మ్రోయ నీవె ప్రభుడవు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 19
పెన్న బద్దె వోలు పెన్న పాయ పయిన
నీళ్ళ మీద మంట నెగడ జేసి
యజ్ఞ ఫలమొ సగిన యతివయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 20
----- వెంకట రాజారావు . లక్కాకుల
30, మార్చి 2017, గురువారం
వెంకయ్య స్వామి శతకం -- 2
భగవాన్
గొలగమూడి వెంకయ్య స్వామి
-------------------------------------
బ్రతికి నంత వట్టు పరమాత్మ కళలతో
బ్రతికి ప్రజల కొఱకు పాటు పడితి ,
జనులు దేవు డనుచు వినుతించ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 1
దేహ ధారి యగుచు దీపించు నానాడు
వర సమాథి యందు వరలు నేడు
నిన్ను నమ్మినాము , నిలుమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 2
వ్రేలి ముద్ర వేసి వెచ్చించి తపమును
చీటి వ్రాసి యిచ్చి శ్రీలు కలుగ
మాకు తోడయితివి , మాన్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 3
జబ్బు చేసి నపుడు సాగి పై పంచతో
విసిరి , దారములను వేసి మెడను
బాగు చేసినావు పరమాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 4
పేద ప్రజల గాచు పెన్నిధి నీవయ్య
ఆరు లక్ష చూపు లందు జూచి
ఆదుకొమ్ము మమ్ము , చేదుకో , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 5
బ్రతుకు బరువు మ్రోయ గతి నీవె యని పూని
వచ్చి కొలుచు వారి వరదు డగుచు
గొలగమూడి లోన కొలువైన వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 6
గొలగమూడి జేరి కోవెల దర్శించి
నీ సమాథి తాకి నిన్ను దలచి
మ్రొక్కు కున్న తీరు మ్రొక్కులు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 7
అన్నదాన సత్ర మందున కూర్చుండి
భోజనమ్ము తిన్న పుణ్య జనుల
తృప్తి కొలువ లేము , ఆప్తుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 8
గొలగమూడి యాత్ర తలచుట తోడనే
అడ్డు దొలగి క్షేత్ర మరుగు వరకు
క్షేమ మరసి గాచు శ్రీలుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 9
నోరు దెరిచి ఆదినారాయణా ! యన్న
పిలుపు విన్న వెంట ప్రియము గూర్చ
నీవు వత్తు వనుట నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 10
గొలగమూడి వెంకయ్య స్వామి
-------------------------------------
బ్రతికి నంత వట్టు పరమాత్మ కళలతో
బ్రతికి ప్రజల కొఱకు పాటు పడితి ,
జనులు దేవు డనుచు వినుతించ , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 1
దేహ ధారి యగుచు దీపించు నానాడు
వర సమాథి యందు వరలు నేడు
నిన్ను నమ్మినాము , నిలుమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 2
వ్రేలి ముద్ర వేసి వెచ్చించి తపమును
చీటి వ్రాసి యిచ్చి శ్రీలు కలుగ
మాకు తోడయితివి , మాన్యుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 3
జబ్బు చేసి నపుడు సాగి పై పంచతో
విసిరి , దారములను వేసి మెడను
బాగు చేసినావు పరమాత్మ ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 4
పేద ప్రజల గాచు పెన్నిధి నీవయ్య
ఆరు లక్ష చూపు లందు జూచి
ఆదుకొమ్ము మమ్ము , చేదుకో , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 5
బ్రతుకు బరువు మ్రోయ గతి నీవె యని పూని
వచ్చి కొలుచు వారి వరదు డగుచు
గొలగమూడి లోన కొలువైన వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 6
గొలగమూడి జేరి కోవెల దర్శించి
నీ సమాథి తాకి నిన్ను దలచి
మ్రొక్కు కున్న తీరు మ్రొక్కులు , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 7
అన్నదాన సత్ర మందున కూర్చుండి
భోజనమ్ము తిన్న పుణ్య జనుల
తృప్తి కొలువ లేము , ఆప్తుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 8
గొలగమూడి యాత్ర తలచుట తోడనే
అడ్డు దొలగి క్షేత్ర మరుగు వరకు
క్షేమ మరసి గాచు శ్రీలుడా ! వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 9
నోరు దెరిచి ఆదినారాయణా ! యన్న
పిలుపు విన్న వెంట ప్రియము గూర్చ
నీవు వత్తు వనుట నిజమయ్య , వెంకయ్య
స్వామి ! శరణు నీదు చరణములకు . -- 10
29, మార్చి 2017, బుధవారం
తెలుగు వారికందరికీ ' హేవిళంబి ' శుభాకాంక్షలు .
వానలు తగినంత పడి పాడి పంటలు
తగ నితోధకముగ తనరు గాత !
ఆరోగ్య భాగ్యమ్ము లలరి జన గణము
లెల్ల భాగ్యాల భాసిల్లు గాత !
చదువు సంధ్యలు నేర్చి చక్కగా పిల్లలు
విజయాలు పొంది లాభింత్రు గాత !
పెరిగి యూర్లన్ని సుభిక్షమై , యొకరి
కింత బెట్టు పస లేతెంచు గాత !
' హేవిళంబి ' తెలుగుగాది హేళలు పర
చుకొని , సకల తెలుగు జాతి , సుఖము శాంతి
పాదుకొను గాత ! యేటి కేడాది యంత ,
అందరికి నా శుభాకాంక్ష లంద జేతు .
తగ నితోధకముగ తనరు గాత !
ఆరోగ్య భాగ్యమ్ము లలరి జన గణము
లెల్ల భాగ్యాల భాసిల్లు గాత !
చదువు సంధ్యలు నేర్చి చక్కగా పిల్లలు
విజయాలు పొంది లాభింత్రు గాత !
పెరిగి యూర్లన్ని సుభిక్షమై , యొకరి
కింత బెట్టు పస లేతెంచు గాత !
' హేవిళంబి ' తెలుగుగాది హేళలు పర
చుకొని , సకల తెలుగు జాతి , సుఖము శాంతి
పాదుకొను గాత ! యేటి కేడాది యంత ,
అందరికి నా శుభాకాంక్ష లంద జేతు .
వెంకయ్య స్వామి శతకం -- 1
శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి
ఆరాధన రూప పద్య శతకం
( పరిచయము -- 1)
----------------
నేటి కాలంలో ఏ మలినమూ అంటని
మహాను భావులరుదు .అలాంటిమహనీయులలో
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఒకరు .
శ్రీ స్వామి నెల్లూరు జిల్లా , నాగులేటూరు గ్రామంలోవ్యవసాయకుటుంబంలోజన్మించినాడు .
బాల్యంలో వ్యవసాయం పనులు చేసే వాడు .
ఇరవై యేళ్ళ వయసులో ఊరొదిలి పెన్నానది లో
నూ , పెన్నకిరువైపుల గ్రామాలలోనూ తిరుగుచుం
డేవాడు .
తనలోకంలో తానుండేవాడు . తదనంతర
కాలంలో తదేక ధ్యానంలో తంబూర మీటుతూ
తన కనువైన స్థలంలో గడిపే వాడు . క్రమంగా
ఆప్రాంత ప్రజలు వెంకయ్య స్వామిగా గుర్తించి
గౌరవించడం ప్రారంభ మయ్యింది .
ఆయన ఏది చెబితే అది జరిగేది . రోగగ్ర
స్తులకు మంత్రించి నయం చేసేవాడు . ఎవ్వరినీ
ఏదీ అడిగేవాడు కాదు . పిలిచి అన్నం పెట్టేవారు .
స్వామిని బాల్యమాది నేనెరుగుదును . మా గ్రా
మం కుల్లూరికి ప్రక్కన రాజుపాళెంలోనూ , కాస్త
దూరంలోని పెన్నబద్వేలు లోనూ ఎక్కువ గడిపే
వాడు . చాల నిరాడంబర జీవితం గడిపి నాడు .
అర్థ ముతక చొక్కా ముతక పంచ ఆయన ఆస్తి . పైపంచ చుట్ట చుట్టి ప్రక్కన పెట్టు
కుని దానితో విసిరి మంత్రించి జబ్బులు నయం
చేసేవాడు . తినడం భిక్షాన్నమే . కార్యార్థమై వచ్చి అడిగిన వాళ్ళకు చీటీ వ్రాయించి వ్రేలిముద్రలేసిఇచ్చేవాడు .ఆయనమాట విన్న
వాళ్ళంతాబాగుపడ్డారు .వినకచెడినవాళ్ళూఉన్నా రు .
దాదాపు ఎనభై యేళ్ళదాకా బ్రతికి జ
నుల చేత భగవానుడిగా పూజింపబడి , చివరి
దశలో గొలగమూడి గ్రామంలో సమాధియైనాడు .
ఆ సమాథియే శ్రీస్వామి దేవాలయంగా , గొలగ
మూడి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నవి .
ఈక్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగార
మై వారి కోరికలు తీరుతూ భక్తజన సందోహంగా
మారింది . నేనెరిగిన వెంకయ్య స్వామి జీవిత
చరిత్రను ఉన్నదున్నట్లుగా పూర్వం ' భగవాన్ శ్రీ
శ్రీశ్రీ వెంకయ్యస్వామి వారి సత్య ప్రమాణ దివ్య చరితము ' గా వ్రాయడం జరిగింది .
స్వచ్చమైన జీవితం గడిపి జనులతో
మమేకమై ఆత్మశక్తితో జనుల బాధలను తొలగిం
చిన ఆ నిరాడంబరుడు నా కారాథ్యుడు .
చిన్న చిన్న ఆటవెలది పద్యాలతో ఆ స్వా
మి మహనీయ తత్త్వాన్ని ఆరాధిస్తూ శతకం వ్రా
యడం జరిగింది .
----- వెంకట రాజారావు . లక్కాకుల
28, మార్చి 2017, మంగళవారం
తెలుగుగాది .....
అల్లదే టీవీలొ అడ్డ నామాలోళ్ళు
అడ్డ దిడ్డముగ వాదాడు చుండ
బ్లాగులో ఎఫ్ బీ లొ రక రకాలుగ కవుల్
ఇసిరి పద్యాలు పారేయు చుండ
ఆండాళ్ళు టీవీల కంటుకోగ , మొగుళ్ళు
హోటళ్ళ నుండి సాపాటు తేగ
ఎండలకు తడారి గండు కోయిల గొంతు
పెగలక నీళ్ళకు వెతుకు చుండ
హేవిళంబియా - కాదుట - హేమలంబి ?
కాదు - హేవిలంబ యని చీకాకు పెట్ట
పండితుల్ , నేడో ? రేపొ ? రానుండె , తెలుగు
గాది పర్వదిన మ్మిల మీదికి దిగి .
అదిగొ ! కందాయ ఫలము , రాజావమాన ,
పూజ్యములు దెల్ప , పంచాంగముల్ పఠించి
నుదుట వ్రాయంగ వచ్చారు బుధులు కనుము ,
కష్టమును నమ్ముకోకున్న కనము ఫలము .
అడ్డ దిడ్డముగ వాదాడు చుండ
బ్లాగులో ఎఫ్ బీ లొ రక రకాలుగ కవుల్
ఇసిరి పద్యాలు పారేయు చుండ
ఆండాళ్ళు టీవీల కంటుకోగ , మొగుళ్ళు
హోటళ్ళ నుండి సాపాటు తేగ
ఎండలకు తడారి గండు కోయిల గొంతు
పెగలక నీళ్ళకు వెతుకు చుండ
హేవిళంబియా - కాదుట - హేమలంబి ?
కాదు - హేవిలంబ యని చీకాకు పెట్ట
పండితుల్ , నేడో ? రేపొ ? రానుండె , తెలుగు
గాది పర్వదిన మ్మిల మీదికి దిగి .
అదిగొ ! కందాయ ఫలము , రాజావమాన ,
పూజ్యములు దెల్ప , పంచాంగముల్ పఠించి
నుదుట వ్రాయంగ వచ్చారు బుధులు కనుము ,
కష్టమును నమ్ముకోకున్న కనము ఫలము .
మా కుల్లూరు -- 8
మా కుల్లూరు
----------------
ఖణ ఖణ ఖణ మంచు వినిపించు తప్పెట్ల
కదన శబ్దాలకు కాళ్ళు కదులు
ఫెళ పెళ పెళ మని విసురు పటాకత్తి
చండ ప్రహరలకు గుండె లదురు
ధగ ధగ ధ్వాంత మధ్యాంత్య శోభలతోడ
విను వీథిలో ఔట్లు ప్రేలు సొదలు
గిడి గిడి మేళాలు కీలుగుర్రాలును
బుట్ట బొమ్మల కేళికాట్ట హాస
ములు కనంగను ముసిలి యొగ్గులును కూడ
ఉరక లెత్తుదు రుత్సాహ పరవశమున
తవిలి దుర్గాష్టమిని మహర్ణవమి నాడు
నొనరు కుల్లూరి దశరా మహోత్సవములు .
----------------
ఖణ ఖణ ఖణ మంచు వినిపించు తప్పెట్ల
కదన శబ్దాలకు కాళ్ళు కదులు
ఫెళ పెళ పెళ మని విసురు పటాకత్తి
చండ ప్రహరలకు గుండె లదురు
ధగ ధగ ధ్వాంత మధ్యాంత్య శోభలతోడ
విను వీథిలో ఔట్లు ప్రేలు సొదలు
గిడి గిడి మేళాలు కీలుగుర్రాలును
బుట్ట బొమ్మల కేళికాట్ట హాస
ములు కనంగను ముసిలి యొగ్గులును కూడ
ఉరక లెత్తుదు రుత్సాహ పరవశమున
తవిలి దుర్గాష్టమిని మహర్ణవమి నాడు
నొనరు కుల్లూరి దశరా మహోత్సవములు .
27, మార్చి 2017, సోమవారం
మా కుల్లూరు -- 7
మా కుల్లూరు
----------------
దేశ మంతట ప్రతి యూర దేవి పూజ
మాకు మాత్ర మాయుధ పూజ శ్రీకరముగ
యుధ్ధ విద్యలు నేర్చన యూరు గనుక
నేటికిని దశరాకు రాణించు చుండు .
రామ లక్ష్మణులు మా రాచ బిడ్డలు ధను
ర్బాణాలు దాల్చి వీర్యమ్ము మెరయ
అష్టమి తిథియందు నరయ నల్లేనుంగు
నెక్కి యూరేగుదు రక్కజముగ
ఆనాటి యుభయ మహా ప్రదాత ఘనుడు
గంగాధరం గారు గాఢ భక్తి
జ్వాజ్వల్య మానమై జైకొట్ట జనములు
జరిపింతు రెలమి పూజ లొనరించి
రేయి రేయంత యును పగలే యనంగ
దీప కాంతులతో , భజంత్రీల - తప్పె
ట్ల ఘన రావము చెలంగ , రంగ రంగ
వైభవము లొప్ప నూరంత వరలు చుండు .
----------------
దేశ మంతట ప్రతి యూర దేవి పూజ
మాకు మాత్ర మాయుధ పూజ శ్రీకరముగ
యుధ్ధ విద్యలు నేర్చన యూరు గనుక
నేటికిని దశరాకు రాణించు చుండు .
రామ లక్ష్మణులు మా రాచ బిడ్డలు ధను
ర్బాణాలు దాల్చి వీర్యమ్ము మెరయ
అష్టమి తిథియందు నరయ నల్లేనుంగు
నెక్కి యూరేగుదు రక్కజముగ
ఆనాటి యుభయ మహా ప్రదాత ఘనుడు
గంగాధరం గారు గాఢ భక్తి
జ్వాజ్వల్య మానమై జైకొట్ట జనములు
జరిపింతు రెలమి పూజ లొనరించి
రేయి రేయంత యును పగలే యనంగ
దీప కాంతులతో , భజంత్రీల - తప్పె
ట్ల ఘన రావము చెలంగ , రంగ రంగ
వైభవము లొప్ప నూరంత వరలు చుండు .
21, మార్చి 2017, మంగళవారం
ఇది వసంత హేల .....
భూమీ తలమును రంగుల
ఆమని ముంచెత్తె , చివురుటాకులెరుపులో
పామిన శ్యామలమయ్యెను ,
ఏమని వర్ణించ వచ్చు నీ వని యమునన్ .
నిండుగా పూచి పొగడ వన్నియలు వోవ
దరిసి నాధుని కైసేయ దండ గ్రుచ్చి
మురిసి రాధిక మాధవుముందు నిల్చి
గుండెలకు గుండెలానించి దండ గూర్చె .
మోదుగ పూగుత్తిని గన
మాధవునికి రాధమీద మనసు దవిలి , బిం
బాధరి మోవికి వంశీ
మాధుర్యపు కేళి పంచి మరులొలికించెన్ .
బృందావనమున గోపీ
బృందముతో కృష్ణు డాడె , బింబాధరులున్
బందీలై మాధవునికి
సంధించిరి సరస మధుర సరి సమరమ్ముల్ .
ఇది వసంత హేల , యిల కెన్నిరంగులో
ప్రకృతి కన్య పూచి పరవశించె ,
ఇందు బ్రతుకు మనిషి కెందుకో ప్రకృతితో
పాలు పంచు కొనుట పడుట లేదు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)